బొంరాస్ పేట : మండలంలోని కొత్తూరు గ్రామంలో కాంగ్రెస్కు చెందిన ఫకీరప్ప, చిన్నోడు, కిష్టప్ప, బాలు, లాలప్ప, అంజిలప్ప, కిష్టప్ప, సుమలత తదితర 90మంది కార్యకర్తలు గురువారం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, జడ్పీటీసీ అరుణాదేశు, నాయకులు బండ శ్రీనివాస్, బాలప్ప, నర్సింలుగౌడ్, రాంచంద్రయ్య, బాల్రెడ్డి, లింగం పాల్గొన్నారు.