విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామంటున్న అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. అందుకు నిలువెత్తు నిదర్శనం ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలల విద్యార్థులను ట్రాక్టర్లలో తరలించడమే.
విద్యార్థుల తరలింపునకు మినీ బస్సులు, ఫిట్నెస్ ఉన్న వాహనాలను వినియోగించాల్సి ఉండగా.. అధ్యాపకులు మాత్రం కాసులకు కక్కుర్తిపడి తక్కువ ఖర్చుతో వచ్చే డీసీఎంలు, ట్రాక్టర్లు, ఆటో ట్రాలీలను వినియోగిస్తున్నారు. అదీకూడా ప్రమాదకర స్థాయిలో ఒక్కో ట్రాక్టర్లో సుమారు 50 నుంచి 60 మందిని ఎక్కిస్తున్నారు. అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
– ఇబ్రహీంపట్నం, మార్చి 1