మొయినాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు సంబురాలు అంబరాన్ని తాకేలా వైభవంగా నిర్వహించారు. ట్రాక్టర్ వెనుక ట్రాక్టర్ కట్టి పొదాము పదా బిడ్డా అన్నట్లుగా ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. డప్పులు దరువులు, డీజే పాటల హోరులో ట్రాక్టర్ ర్యాలీ కొనసాగింది. శుక్రవారం మొయినాబాద్ మండల కేంద్రంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు గునుగుర్తి జయంత్, ఎంఏ రావూఫ్, మాజీ జడ్పీటీసీ కొంపల్లి అనంతరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. గ్రామా గ్రామాన రైతులు, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మండల కేంద్రంలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై సుమారుగా అర కిలోమీటర పోడువన ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి జనసందోహంగా మారింది. ఎమ్మెల్యే కాలె యాదయ్య ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొని ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీ ప్రారంభించారు. డప్పులదరువులు, డీజే హోరులో డ్యాన్స్లు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. పండుగ వాతావరణంలో ర్యాలీ కొనసాగింది. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి జైతెలంగాణ నినాదాలు చేయించడంతో మండల కేంద్రం దద్దరిల్లింది. అదే విధంగా మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల పట్ల ఎంతో ఆత్మీయంగా ఉన్నారని, వారి ఆర్థిక అభివృద్ధి కోసం అనేక రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు.
రైతుబంధు ప్రవేశపెట్టిన తరువాత పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. అన్నమో రాంచంద్రా అన్న తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికి అన్నపూర్ణగా మారిందని అభివర్ణించాడు. రైతుల అండ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పుష్కలంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు నర్సింహరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ డప్పు రాజు, డైరెక్టర్ ఆంజనేయులుగౌడ్, వైస్ ఎంపీపీ మమత, టీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అద్యక్షుడు శ్రీనివాస్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి నర్సింహ్మగౌడ్, సర్పంచ్లు రాజు, శ్రీనివాస్పా ల్గొన్నారు.