ఆదిబట్ల/వికారాబాద్, జూలై 18 : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం రంగారెడ్డి, వికారాబాద్ కలెక్టర్లలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 20న తాత్కాలికంగా రద్దు చేసినట్టు కలెక్టర్లు నారాయణరెడ్డి, దీపక్తివారీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా స్థాయి కీలక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో రద్దు చేయాల్సి వచ్చిందని .. ఈ నెల 27 నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా ప్రతి సోమవారం కొనసాగుతుందని వారు తెలిపారు. దరఖాస్తుదారులు గమనించి.. ఎవరూ అప్లికేషన్లు సమర్పించేందుకు కలెక్టరేట్లకు రావొద్దని సూచించారు.