ఎల్బీనగర్వాసులు దశాబ్దాలకాలంగా ఎదురుచూసిన ఉదయం రానే వచ్చింది. సమస్యల నివేదన – సత్వర పరిష్కారమే ఎజెండాగా బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ‘మన నగరం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు ‘మనం మారుదాం – నగరాన్ని మారుద్దాం’ అంటూ విస్తృత కార్యక్రమాలు చేపట్టిన మంత్రి కేటీఆర్ నగరాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సఫలీకృతులయ్యారు. ప్రస్తుతం చేపట్టిన మన నగరం కార్యక్రమంలో దశాబ్దాలుగా భూ రిజిస్ట్రేషన్లులేక మూడు రెట్లు పన్నులు కడుతూ, నీటి బిల్లులు చెల్లిస్తూ అరిగోస పడుతున్న కాలనీవాసులకు తీపికబురు అందనున్నది. భూ రిజిస్ట్రేషన్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ఈ వేదికపై మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. రిజిస్ట్రేషన్లు, యూఎల్సీ, అసైన్డ్ స్థలాల పరిష్కారంతో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్రెడ్డినగర్, నాగోలు, మన్సూరాబాద్, చంపాపేట డివిజన్లలోని సుమారు 44 కాలనీల్లోని సుమారు 10 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది.
ఎల్బీనగర్, నవంబర్ 1: ఎల్బీనగర్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ రిజిస్ట్రేషన్ల సమస్యలకు మోక్షం లభించనున్నది. భూ రిజిస్ట్రేషన్లు, యూఎల్సీ, అసైన్డ్ భూముల పరిష్కారానికి బుధవారం సాయంత్రం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో (నవంబర్ 2న) నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రభుత్వ జీవోను విడుదల చేయనున్నారు. దీంతో 44 కాలనీల కు చెందిన సుమారు 10వేల పైచిలుకు కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను సీఎం
కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నెరవేర్చుతున్నారు.
మన నగరంతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి
2018లో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ నిర్వహించిన ‘మన నగరం’ కార్యక్రమంలో ఆయా కాలనీలవాసులు భూ రిజిస్ట్రేషన్లు, యూఎల్సీ, అసైన్డ్ స్థలాల సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. అప్పుడే మొదటి బీజం పడింది. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ అప్పటి ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీతో పాటు రెవెన్యూ విభాగం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి సమస్యలను ఓ కొలిక్కి తీసుకుని వచ్చారు.
ఐదు హామీలతో టీఆర్ఎస్లోకి..!
ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా గెలిచిన దేవిరెడ్డి సుధీర్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. తాను ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఐదు వాగ్దానాలు చేశానని, వాటిని పరిష్కరించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను కోరారు. వారి నుంచి స్పష్టమైన హామీ రావడంతో కారెక్కారు. గత నాలుగేళ్లుగా అదే ప్రయత్నం లో ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి కాలనీలవాసులతో సుమారు 40 పర్యాయాలు, అధికారులతో సుమారు 10 పర్యాయాలు, మంత్రి కేటీఆర్తో 8 సార్లు, సీఎం కేసీఆర్తో సుమారు 3 పర్యాయాలు సమావేశమై సమస్య తీవ్రతను ప్రస్తావించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం బుధవారం నిర్వహించనున్న బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక జీవోను జారీ చేయనున్నారు.
సమస్యను పరిష్కరిస్తేనే పోటీ చేస్తా..!
దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్లు లేక మూడు రెట్లు పన్నులు, అధిక మొత్తంలో నీటి బిల్లులు కడుతూ నియోజకవర్గంలోని 44 కాలనీలకు చెందిన 10వేల పైచిలుకు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. అయితే ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ అన్ని పార్టీలు భూ రిజిస్ట్రేషన్లు, యూఎల్సీ, అసైన్డ్ స్థలాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడమే తప్ప.. దశాబ్దాలుగా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. అయితే 2018 ఎన్నికల ప్రచారంలో ఆయా సమస్యలను పరిష్కరిస్తానని సుధీర్ రెడ్డి ప్రజలకు మాట ఇచ్చారు. ఈ సమస్యలను పరిష్కారం చేయకుంటే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోనని కాలనీవాసుల సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు.
వనస్థలిపురం, అక్టోబర్ 1 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం హర్షణీయమని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్గౌడ్ అన్నారు. మాజీ కార్పొరేటర్లు సామ రమణారెడ్డి, ముద్దగౌని లక్ష్మీప్రసన్నలతో కలిసి సీఎం కేసీఆర్, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశా రు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎన్రెడ్డి నగర్, నాగోల్, చంపాపేట్, మన్సూరాబాద్ డివిజన్లలో నెలకొన్న సమస్య పూర్తిగా పరిష్కారం అవుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేందర్రెడ్డి, వెంకయ్య, మహబూబ్ అలీ, పల్లె కృష్ణాగౌడ్, సరస్వతి, శేఖర్, ప్రశాంత్గౌడ్, పద్మ, కిషన్గౌడ్, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.
సుధీర్ రెడ్డి కృషితో ప్రత్యేక జీవో
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి కాలనీవాసులతో సుమారు 40 సార్లు సమావేశాలు నిర్వహించి సమస్యను క్లుప్తంగా తెలుసుకున్నారు. ఈ విషయమై అధికారులతోనూ చర్చించారు. మంత్రి కేటీఆర్తో సుమారు పది సార్లు సమావేశాలు, సీఎం కేసీఆర్తో సుమారు మూడు సా ర్లు సమావేశాలు నిర్వహించారు. ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను తెలుపడంతో ప్రభుత్వం సమస్య పరిష్కారానికి సానుకూలంగా స్పందించింది. ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా జీవో తీసుకువచ్చేందుకు కసరత్తు పూర్తి చేశారు. ఫలితంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్రెడ్డినగర్, నాగోలు, మన్సూరాబా ద్, చంపాపేట డివిజన్లలోని సుమారు 44 కాలనీల్లోని 10 వేల కు టుంబాలకు మేలు జరుగనున్నది. దీంతో దశాబ్దాలుగా ప్రజ లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కారం కానున్నాయని ఆయా కాలనీలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా తరలిరావాలని కాలనీల వాసులు ఏకంగా తమ కాలనీల్లోని ఇంటింటికీ సర్యూలర్ జారీ చేశారు.
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఎల్బీనగర్ వాసులకు మరికొన్ని గంటల్లో తీపి కబురు అందనున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా శుభవార్తను ప్రకటించి 44 కాలనీలకు చెందిన సుమారు పదివేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చనున్నది.అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ.. మంత్రి నోటి వెంట జీవో విడుదల ప్రకటన స్వయంగా వినాలని ఇక్కడి ప్రజలు
ఉవ్విళ్లూరుతున్నారు. కాలనీలవాసులు స్వచ్ఛందంగా సభా స్థలికి చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
రెక్కాడితేగాని డొక్కాడని పేదలు పైసాపైసా
కూడబెట్టుకుని నగర శివారులో గూడు ఏర్పాటు చేసుకునేందుకు రెండు దశాబ్దాల కిందట ప్లాట్లు కొన్నారు.
రిజిస్ట్రేషన్లూ చేయించుకున్నారు. బ్యాం కుల నుంచి రుణం పొంది ఇండ్లు కూడా నిర్మించుకున్నారు. ఇక స్థిరపడ్డామని సంతోష పడుతున్న క్రమంలోనే ఆనాటి ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. రిజిస్ట్రేషన్ చేయకుండా, యూఎల్సీ, అసైన్డ్, ప్రభుత్వ భూములని వేధించసాగింది. కట్టుకున్న ఇండ్లకు మూడు రెట్లు అధిక పన్ను వసూలు చేస్తూ ముప్పు తిప్పలు పెట్టింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ మన నగరం కార్యక్రమాన్నినిర్వహించిన మంత్రి కేటీఆర్ వేలాది మంది పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని చలించిపోయారు. వారికి స్పష్టమైన హామీ ఇచ్చి వారిలోమనోధైర్యాన్ని నింపారు.
ఎన్ని ఇబ్బందులు పడ్డామో..!
14 ఏండ్ల మా కాలనీ సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది. గతంలో అక్యూపెన్సీ రైట్ సర్టిఫికెట్ ఉన్న సమయంలో హుడా లే అవుట్ చేయగా ప్లాట్లు కొనుగోలు చేశాం. 2008లో మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని, బ్యాంక్ లోన్ ద్వారా ఇండ్లు కట్టుకున్నాం. అధికారులు 1997లో ఓఆర్సీని క్యాన్సిల్ చేశారు. కానీ మాకు ఎవరూ చెప్పలేదు. ఈ విషయం 2008 చివరిలో తెలిసింది. వెంటనే అప్పటి ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. అప్పటి నుంచి 14 ఏండ్లలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో మాకే తెలుసు. సమస్యను పరిష్కరిస్తున్నా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. 65 ఎకరాల్లో ఉన్న కాలనీలోని 650 ఇండ్లకు చెందిన వారంతా ప్రభుత్వానికి రుణపడి ఉంటారు.
– పుల్లారెడ్డి, కన్వీనర్ శ్రీకృష్ణ దేవరాయనగర్, బీఎన్రెడ్డినగర్ డివిజన్
పరిష్కరిస్తాననే ఆత్మవిశ్వాసంతోనే..
నియోజకవర్గంలో ప్రధానమైనవి రిజిస్ట్రేషన్లు, యూఎల్సీ, అసైన్డ్ స్థలాల సమస్యలు. నాలుగేండ్ల కిందట ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడంతో ఇక్కడి నాయకులు నన్ను హేళన చేశారు. కానీ హామీలు నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పా. తప్పకుండా పరిష్కరిస్తాననే ఆత్మ విశ్వాసంతో చెప్పిన. నేడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నా. దశాబ్దాలుగా ఉన్న సమస్యలు పరిష్కారం కానుండటం చాలా సంతోషంగా ఉన్నది.
– దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్
లబ్ధి చేకూరనున్న కాలనీలు ఇవే..!
చంపాపేట డివిజన్ మాధవనగర్, శ్రీనిధి కాలనీ, మారుతీనగర్, ఈస్ట్ మారుతినగర్, మల్రెడ్డి రంగారెడ్డి కాలనీ, రాజిరెడ్డి కాలనీ, ఎస్వీ కాలనీ, వినాయకనగర్ కాలనీల్లోని యూఎల్సీ సమస్యలు, జనార్దన్రెడ్డినగర్, మల్లికార్జునా హిల్స్, అవె న్యూ హోమ్స్, సరస్వతినగర్, పద్మావతి కాలనీ అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కారం కానున్నాయి.
మన్సూరాబాద్ డివిజన్
బాలాజీనగర్, శ్రీరామహిల్స్ కాలనీ, వివేకానందనగర్, రాగాల ఎన్క్లేవ్, పద్మావతి నగర్, కమలానగర్, సీఆర్ ఎన్క్లేవ్, బ్యాంక్ కాలనీలలో యూఎల్సీ సమస్యలు, కాస్మోపాలిటన్ కాలనీలో ప్రభుత్వ భూమి సమస్యలు తీరనున్నాయి.
బీఎన్రెడ్డినగర్ డివిజన్
సామనగర్, సీబీఐ కాలనీ, విజయనగర్ కాలనీలలో అసైన్డ్ భూమి సమస్యలు, సాగర్ కాంప్లెక్స్, శ్రీపురం కాలనీలలో ప్రభుత్వ భూమి సమస్యలు, వైదేహీనగర్, బీఎన్రెడ్డినగర్, శ్రీరామనగర్, ఎస్కేడీ నగర్లలో ఇనాం స్థలాల (22-ఎ) సమస్యలు పరిష్కారం కానున్నాయి.
నాగోలు డివిజన్
సాయినగర్ కాలనీ, కో ఆపరేటీవ్ బ్యాంక్ కాలనీ, జైపురికాలనీ, అరుణోదయనగర్, గణేశ్ నగర్, లలితానగర్ నార్త్ కాలనీ, సాయినగర్ సౌత్ , శ్రీసాయినగర్, వీరారెడ్డి కాలనీ, ఈశ్వరపురి కాలనీ, హరిపురి కాలనీ, మల్లికార్జునా హిల్స్ కాలనీల్లోని అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కారం కానున్నాయి.
ఫలించిన 15 ఏండ్ల పోరాటం
నాగోలులో 1966 నుంచి 2002 వరకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. బ్యాంకు లోన్లు, పర్మిషన్లు కూడా ఉన్నా యి. 2002లో ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. చివరకు ఆశలు వదులుకున్నాం. 2018లో కేటీఆర్ దేవుడిలా వచ్చారు. ‘మన నగరం’లో మాకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆశలు పుట్టుకొచ్చాయి. తాజాగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో సమస్య పరిష్కారం అవుతుండటం చాలాసంతోషంగా ఉన్నది.
– శరత్రెడ్డి, అధ్యక్షుడు, నాగోలు కాలనీ సంక్షేమ సంఘాల సమన్వయ సమితి
‘మన నగరం’ మాకు వరం
పట్టా స్థలాలను కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్నాం. రెవెన్యూ, యూఎల్సీ వారి తప్పిదంతో 2007లో మా కాలనీలను అర్బన్ ల్యాండ్ సీలింగ్లోకి తీసుకుని రావడంతో సమస్యలు మొదలయ్యాయి. కోర్టుకు వెళ్లినా సమ స్య పరిష్కారం కాలేదు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను సమన్వయ పర్చుకుంటూ ఎమ్మెల్యే చేసిన కృషి మరువలేము.
– దూరంపూడి సాంబిరెడ్డి, అధ్యక్షుడు, బాలాజీనగర్ కాలనీ, మన్సూరాబాద్ డివిజన్