శంషాబాద్ : శంషాబాద్లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి భూదాన్ (25) అనే యువకుడు ఇవాళ మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయాడు.
కూలీలతో వెళ్తున్న లారీకి ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు అడ్డురావడంతో డ్రైవర్ తప్పించబోగా అదుపుతప్పి బోల్తాపడింది.
ప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న ముగ్గురు ఒడిశాకు చెందిన కార్మికులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయారు.
మృతులను కృపాసున (40), గోపాల్దీప్ (45), కళాకుమార్ (25), సహదర్ (40), హస్తా (45), పరమానంద్ (52)గా గుర్తించారు.
మరో 20 మందికి గాయాలయ్యాయి. వీరికి దవాఖానలో చికిత్స అందిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి