న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ ; ఉమ్మడి జిల్లాలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసల జోరు పెరుగుతున్నది. ఏ ఊరికెళ్లినా బీఆర్ఎస్ అభ్యర్థులకు జనం బ్రహ్మరథం పడుతుండడంతో పాటు అభివృద్ధిలో తాము సైతం భాగస్వాములమవుతామంటూ గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో ప్రతిపక్షాలకు క్యాడరే లేకుండా పోతుండడంతో ఆ పార్టీల నాయకులు కంగుతింటున్నారు. మంగళవారం ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, మెతుకు ఆనంద్, మహేశ్రెడ్డి, అంజయ్యయాదవ్, రోహిత్రెడ్డి, నరేందర్రెడ్డిల సమక్షంలో పలుగ్రామాల్లో వివిధ పార్టీలకు చెందినవారు బీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యేలు గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పలు పార్టీల శ్రేణులు భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేస్తారని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించేలా ముందుకు వెళతామన్నారు. పార్టీలో చేరినవారికి ఎమ్మెల్యేలు గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని తెలిపారు. పలు పార్టీలకు చెందిన శ్రేణులు వలస వస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని మహా శక్తిగా మారిందన్నారు. దీంతో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అమాస, పున్నానికి వచ్చే నాయకులతో జాగ్రత్తగా ఉండాలని.. వారి మాయ మాటలు విని మోసపోవద్దని సూచించారు.
బీఆర్ఎస్ వెంటే ప్రజలు
పరిగి : ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. పరిగిలో చౌడాపూర్ మండలం వెంకటాపూర్కు చెందిన కాంగ్రెస్ నాయకులు అనిల్కుమార్, లింగ్యానాయక్, మహేశ్రాథోడ్, ఆంజనేయులు, అంజిలయ్య, నరేశ్, గణేశ్, షబ్బీర్, వెంకట్రాములు, నర్సింహులుతోపాటు 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోని అన్ని వర్గాలకు మేలు కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు.
ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం వికారాబాద్లోని ఎమ్మెల్యే ఆనంద్ నివాసంలో వికారాబాద్ పట్టణం 2వ వార్డు ధన్నారంకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే దేశానికి దిక్సూచిగా మారాయని తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలు సద్వినియోగం చేసుకుంటున్నారని వివరించారు. అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, నాయకులు వెంకటయ్య, శ్రీకాంత్, యాదయ్య, లాలయ్య, గోపాల్, అంజయ్య పాల్గొన్నారు.
తిరుగులేని మహాశక్తిగా బీఆర్ఎస్ పార్టీ
షాద్నగర్రూరల్ : వివిధ పార్టీలకు చెందిన నాయకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు వస్తుండటంతో షాద్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని మహాశక్తిగా మారిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని గంట్లవెల్లి, చించోడ్ గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని పథకాలను గడపగడపకూ వివరించాలన్నారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలంటే కారుగుర్తుకే ఓటు వేయాలన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. గంట్లవెల్లి నుంచి కాంగ్రెస్ నాయకులు చక్కటి శ్రీనివాస్, జగదీశ్, బాలరాజ్, శ్రీశైలం, సాజిద్, వెంకటేశ్, ఖలీల్, ప్రశాంత్, యాదయ్య, ప్రకాశ్, వెంకటయ్య, యాదయ్య, బాలయ్య, జంగయ్య, మిద్దె వెంకటయ్య, చించోడ్ గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన సంతోష్రెడ్డి, శంకర్, రాములు, కమ్లీ, సోమ్లా, బాలయ్య, రాజు, కె.రాజు, చందర్, కిషన్, వెంకటేశ్, రమేశ్, బ్రహ్మచారి, నర్సింహులు, గౌస్మియా, రహమత్, రామచంద్రయ్య, సంతోష్రెడ్డి, నర్సింగ్రావు తదితరులు పార్టీలోకి చేరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి
కొత్తూరు : బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సిద్దాపూర్ మాజీ ఎంపీటీసీ వడ్డె బాలయ్య ఆధ్వర్యంలో కొత్తూరు సిద్దాపూర్ గ్రామ మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు బైరమోని నరసింహ, గుండెమోని నరసింహా, లింగయ్య, శివకుమార్, వడ్డె శివకుమార్ బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్కు ఎదురులేదు.. అంజన్నకు తిరుగులేదు
షాద్నగర్ : తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, ప్రజా సంక్షేమ ఫలాలను అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, షాద్నగర్ నియోజకవర్గ ప్రగతి ప్రదాత ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు తిరుగు, ఎదురులేదని చౌదరిగూడ మండల కాస్లాబాద్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు ముక్తకంఠంతో నినదించారు. మంగళవారం షాద్నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాస్లాబాద్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు సుమారు 100 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంజయ్యయాదవ్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేస్తారని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించేలా చూస్తామని పార్టీలో చేరిన నాయకులు తెలిపారు. అదేవిధంగా బైరంపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 20మంది బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై, ప్రజల కోసం పని చేసే బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించుకోవడమే లక్ష్యంగా పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరవేయాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. విపక్ష నాయకుల మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని.. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
చేరికలతో మతితప్పుతున్న విపక్ష శ్రేణులు
బీఆర్ఎస్లో రోజువారీ చేరికలతో ప్రతిపక్ష పార్టీలకు మతిపోతున్నదని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని టేకల్కోడ్, అంగడిరాయచూర్తోపాటు బొంరాస్పేటలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో 100 మందికి పైగా ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రజలకు నరేందరెడ్డిలాంటి నాయకుడే కావాలని, అమాస, పున్నానికి వచ్చే నాయకులతో ప్రజలకు పనిలేదన్నారు. దుద్యాల మండలం సంగాయపల్లితండా ఉప సర్పంచ్ కమలతో పాటు కాంగ్రెస్కు చెందిన మోతీలాల్నాయక్, కిషన్నాయక్, శివరాంనాయక్, పరశురాంనాయక్, రాజూనాయక్, బావూసింగ్ బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ సలీం, టేకల్కోడ్ సర్పంచ్ గుండప్ప, అంగడిరాయచూర్ సర్పంచ్ గోవింద్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులున్నారు.
ఆశలకు పోయి.. ఆగం కాకండి
కాంగ్రెస్ పార్టీ గాలిపోయిన బెలూన్ అని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. మండలంలోని కొర్విచేడ్ఘని గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహారాష్ట్ర అంబన్న పలువురు యువకులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్లో చేరుతున్నవారి పరిస్థితి నడి సముద్రంలో నావలా మారిందన్నారు. ఆశలకు పోయి భవిష్యత్ను ఆగం చేసుకొవద్దని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, నాయకులు హన్మంతు, శివ, మోతీరాం, తిరుపతి పాల్గొన్నారు. మండల పరిధిలోని మంతట్టి గ్రామానికి చెందిన యువకులు, గ్రామస్తులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పారు. తాండూరు నియోజకవర్గంలో త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఖాళీ కాబోతుందన్నారు.