ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర సర్కార్ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నది. ప్రతి ఏటా రైల్వే బడ్జెట్లోనూ నిరాశను మిగిల్చిన కేంద్రం.. ‘పని’కిరాని ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నది. ఎన్నో ఏండ్లుగా పరిగి, కొడంగల్ నియోజకవర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోని కేంద్రం.. కొత్తగా ప్రేమను ఒలకబోస్తూ వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్కు ఆదివారం కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉన్నది. ఐదేండ్లు అయినా బుల్లెట్ రైల్ ప్రాజెక్టును పట్టించుకోలేదు. భూ సేకరణకుగాను సర్వేకే పరిమితం చేసి ఈ ప్రాంత ప్రజల ఆశలను మోదీ ప్రభుత్వం ఆవిరి చేసింది. వికారాబాద్ ప్రజల చిరకాల డిమాండ్గా ఉన్న వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైల్ పొడిగింపు అంశం కలగానే మిగిలింది. యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు ఏనాడు వికారాబాద్ జిల్లాను పట్టించుకున్న పాపానపోలేదు. ప్రస్తుతం రాజకీయ ప్రయోజనాల కోసమే కొత్త రైల్వేలైన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని, దీనిని అమలు చేసే చిత్తశుద్ధి బీజేపీకి లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
– వికారాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో విపరీతంగా పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధరను వారం రోజుల క్రితం రూ.200 తగ్గించి ప్రజలను నమ్మించే ప్రయత్నం ఎంత చేసినా ఫలితం లేకపోయే సరికి కొత్త ప్రేమకు తెరలేపింది. గత కొన్నేండ్లుగా తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోని పలు కొత్త రైల్వే లైన్ల ప్రకటనను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అయితే వికారాబాద్ జిల్లాకు సంబంధించి గత 20 ఏండ్లుగా డిమాండ్ ఉన్న వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ను ఆదివారం కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అయితే కేవలం రాజకీయ ప్రయోజనాలను ఉద్దేశించి మాత్రమే వికారాబాద్-కృష్ణా కొత్త రైల్వేలైన్ను ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిగి, కొడంగల్, హుస్నాబాద్, దౌల్తాబాద్, మక్తల్, నారాయణపేట మీదుగా వికారాబాద్-కృష్ణా లైన్ను ఎన్నో ఏండ్లుగా ఈ ప్రాంత ప్రజలు విన్నవించారు. అయితే గతంలో ఉన్న కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం కానీ, గత పదేండ్లుగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఏనాడు జిల్లా ప్రజల వినతిని పట్టించుకోలేదు.
ప్రతి రైల్వే బడ్జెట్ సమయంలో మా ప్రాంతానికి రైల్వేలైన్ వస్తున్నదని ఎంతో ఆశతో ఎదురుచూసినా జిల్లాలోని పరిగి, కొడంగల్ నియోజకవర్గాల ప్రజలకు గత ఇరవై ఏండ్లుగా ప్రతి రైల్వే బడ్జెట్ సమయంలోనూ నిరాశే ఎదురైంది. తెలంగాణపై మొదటి నుంచి వివక్ష చూపుతున్న కేంద్రం రాష్ర్టానికి మంజూ రు చేసిన ఏ ప్రాజెక్టు అయిన ఇప్పటివరకు పూర్తికాకపోవడం గమనార్హం. జిల్లా మీదుగా వెళ్లే బుల్లెట్ రైల్ ప్రాజెక్టు సర్వే వద్దనే ఆగిపోయింది. ఐదేైండ్లెనా బుల్లెట్ రైల్ ప్రాజెక్టును కేం ద్రం పట్టించుకోవడం లేదు. భూ సేకరణకు గాను సర్వే నిర్వహించి, రైతులతో సమావేశమైనప్పటికీ సంబంధిత రైతులకు ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతోపాటు ఒక్క ఎకరా భూమిని కూడా సేకరించలేదు. బుల్లెట్ రైల్ మా ప్రాంతం మీదుగా వెళ్తే మా బతుకులు బాగు పడుతాయని అనుకున్న ప్రజల ఆశలను మోదీ ప్రభుత్వం ఆవిరి చేసింది. అలాగే వికారాబాద్ ప్రజల చిరకాల డిమాండ్గా ఉన్న వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైల్ పొడిగింపు అంశం కలగానే మిగిలిపోయింది. వికారాబాద్ స్టేషన్ నుంచి ప్రతీరోజు వేల మంది హైదరాబాద్ వెళ్తుండడం కొన్ని రైళ్లకు మాత్రమే వికారాబాద్ స్టేషన్లో ఆపేందుకు అనుమతివ్వడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రతి రైల్వే బడ్జెట్ సమయంలో ప్రజలతోపాటు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కేంద్రానికి విన్నవిస్తున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా ప్రతీ హామీ ఇవ్వడమే తప్ప వాటిని నెరవేర్చడంలో కేంద్రం చర్యలు మాత్రం శూన్యమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇలా ప్రతి విషయంలో వివక్ష చూపుతూ నిర్లక్ష్యం చూపుతున్న మోదీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏనాడు పట్టించుకోని కేంద్రం రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లాకు కొత్త రైల్వేలైన్ మంజూరు చేశారని జిల్లా మేధావులు, ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే జిల్లా అభివృద్ధి, జిల్లా ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన గతంలో ఉన్న కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ, ప్రస్తుత బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వాలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా ఎన్నికల వేళ నెరవేర్చని ఎన్ని ప్రాజెక్టులు మంజూరు చేసినా, హామీలిచ్చినా కాంగ్రెస్, బీజీపీలను జిల్లా ప్రజానీకం నమ్మే పరిస్థితిలో లేరనేది అన్ని వర్గాల ప్రజల్లోనూ వ్యక్తమవుతుంది.
దేశ జనాభాలో 30 శాతం ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. నిరక్షరాస్యులు అధికం. పుడుతున్న ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 40 మంది కొద్ది రోజులకే మరణిస్తున్నారు. అలాంటి వారి కోసం కేంద్ర బీజేపీ సర్కారు ఆలోచించదు. అదాని లాంటి కుబేరులకు లాభం చేకూరేలా అనేక ప్రతిపాదనలను తీసుకొచ్చింది మోదీ సర్కార్. వ్యాపార అనుకూల దేశాల్లో భారత్ది 130వ స్థానం. మన దేశం వెనకబాటు తనానికి ఇన్ని సాక్ష్యాలను ముందు పెట్టుకొని బీజేపీ మాటలు ఎవ్వరూ నమ్మరు. బుల్లెట్ రైలు ప్రతిపాదన మన ముందుకు తీసుకు రావడం హాస్యాస్పదం. మోడీ జిమ్మిక్కులు ఇక చెల్లవు.
– హన్మంతు, జుంటుపల్లి, యాలాల
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే యత్నం ఇన్నాళ్లు ఊసెత్తని వికారాబాద్-కృష్ణా రైల్వే కొత్త ప్రాజెక్టు ఇప్పుడే కేంద్ర ప్రభుత్వానికి గుర్తొచ్చిందా? ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ప్రయత్నిస్తున్నా ప్రజలు మాత్రం నమ్మ్మే స్థితిలో లేరు. వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ను పొడగిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు నెరవేర్చలేదు. మళ్లీ ఎన్నికల సమయంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. బీజేపీ చెత్త రాజకీయాలను తిప్పి కొడతాం. ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతాం.
– నర్సింహులు, రాఘవపూర్, పరిగి
తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యం
తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించడకుం డా నిర్లక్ష్యంగా వ్యవహరిసున్నది. కృ ష్ణా-వికారాబాద్ మధ్య కొత్తగా రైల్వేలైన్ నిర్మించాలన్న ప్రతిపాదన చాలా ఏండ్ల నుంచి ఉంది. ఎన్నికల ముందు పచ్చజెండా ఊపినా ఇది పూర్తి చేస్తుందనే నమ్మకం ఎవరికీ లేదు.
– జగదీశ్, రేగడిమైలారం, బొంరాస్పేట
ఎంఎంటీఎస్ రైళ్లను వికారాబాద్ జిల్లా కేంద్రం వరకు పొడిగిస్తే జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది. ని త్యం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తుంటారు. వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు వస్తే విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రైళ్లను పొడిగించాలని కోరినా కేంద్రం నుంచి సానుకూల స్పందన కరువైంది.
– వెంకటేశ్, వడిచెర్ల, బొంరాస్పే
త్వరలో ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు కొత్తగా బుల్లెట్ రైల్వే లైన్ను తెరమీదికి తెస్తున్నారు. ఎప్పటి నుం చో వికారాబాద్ వాసుల కల అయిన ఎంఎంటీసీఎస్ను ఇప్పటి వరకు రా లేదు. అది మరిచి, ఇప్పుడు ఈ కొత్త డ్రామ. ఇది వికారాబాద్ వాసులు ఎవరూ నమ్మరు. ముందుగా హైదారాబాద్-వికారాబాద్ ఎంఎంటీఎస్ను ప్రారంభించాలి.
– శ్రీకాంత్రెడ్డి, ఎంపీటీసీ, రొంపల్లి, బంట్వారం
తెలంగాణ ప్రజలను మోసం చేయడా నికే బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్న ది. ఎన్నికల సమయంలో ఎలాగైనా గెలవాలనే కక్కుర్తితో ఇలా ప్రచారం చేస్తున్నది. తెలంగాణలో అభివృద్ధి ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు. సీఎం కేసీఆర్ హ యాంలో మనం అభివృద్ధిని చూస్తున్నాం. ఉమ్మడి ప్రభు త్వాల హయాంలో తెలంగాణ వెనుకబడి పోయింది. కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్లో మనకు అనేక సార్లు మొండి చేయి చూపింది. మళ్లీ బీజేపీ డబుల్ గేమ్కు ఇక్కడ మోస పోయే వారు ఎవరూ లేరు. ఈ సమ యంలో ఎన్ని హామీలిచ్చినా.. ఎన్ని ప్రాజెక్టులు మంజూ రు చేసినా నమ్మేవారు ఎవరూ లేరు.
– కృష్ణ, పెర్కంపల్లి, యాలాల