తాండూరు, డిసెంబర్ 8: వ్యవసాయ రంగంలో ఇన్నోవేషన్, ఎంటర్ ప్రెన్యూర్షిప్లను ప్రోత్సహించేందుకు, వ్యవసాయానికి సాంకేతిక దన్ను గా నిలిచేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ కేంద్రంగా పని చేయనున్న హబ్ సేవలను విరాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంత రైతులకు చేరువ చేసేందుకు తాండూరులో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రూ.1.58 కోట్లతో అగ్రిహబ్ ఏర్పాటు పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.
టీ హబ్ను ఆదర్శంగా తీసుకొని పలు స్టార్టప్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని అగ్రిహబ్కు వ్యవసాయ వర్సిటీ రూపకల్పన చేసింది. వ్యవసాయానికి సాంకేతిక తోడ్పాటు అందించేందుకు యూనివర్సిటీ 11 నుంచి 21 స్టార్టప్లకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్, మిషన్ లెర్నింగ్ తదితర అధునాతన సాంకేతికను వ్యవసాయ రంగంలో ఈ స్టార్టప్ల సాయం తో వినియోగించనున్నారు.
డ్రోన్ల ద్వారా మందు ల పిచికారీ, రోబోటిక్ విధానంలో కలుపుతీయడం, తెగుళ్ల గుర్తించడం తదితర సమాచారం తో పాటు గ్రామీణ యువత, మహిళలు, రైతు లు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అగ్రి బిజినెస్ మెళకువలు నేర్చుకునేందుకు గ్రంథాలయంగా ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు వెల్లడించారు.
నాబార్డు ఆర్థిక సాయంతో తాండూరు వ్యవసా య పరిశోధన కేంద్రంలో రూ.158 కోట్లతో అగ్రిహబ్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నా యి. ఆరు నెలల్లో అగ్రిహబ్ పనులు పూర్తవుతాయని, అప్పటివరకు రైతులకు అగ్రిహబ్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తాం డూరు వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు తెలిపారు. గ్రామీణ యువత, మహిళలు, రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అగ్రి బిజినెస్ మెళకువలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేయడం, అధిక దిగుబడుల సాధనకు శిక్షణ ఇవ్వడంతో పాటు వివిధ రకాల విత్తనాల (వంగడాలు)పై అవగాహన చేయనున్న ట్లు తెలిపారు. తాండూరులో నాణ్యమైన కుసు మ నూనె, కందిపప్పు తయారు చేసి ఇతర ప్రాం తాల్లో విక్రయిస్తున్నారు. దీంతో మంచి పేరు రా వడంతో పాటు తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అధిక దిగుబడులు ఇచ్చే నూతన వంగడాలను తయారు చేయడంతో తాండూరు లో అగ్రిహబ్ ఏర్పాటు చేసే అవకాశం వచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో తాండూరుతో పా టు జిల్లా రైతులకు మరింత మేలు జరగనున్నది.
గ్రామీణ యువత, మహిళ లు, రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అగ్రిబిజినెస్ మెళకువలు నేర్చుకునేందుకు అగ్రిహబ్ ఓ గ్రం థాలయంగా ఉపయోగపడుతుంది. నూతన టెక్నాలజీతో నాణ్యమైన విత్తనాలు, మొక్కల కు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, పంట దిగుబడి తదితర వివరాలు అందుబాటులో ఉంటాయి. అగ్రిహబ్ను ఫాలో అయిన రైతుకు పెట్టుబడులు తగ్గి పంటలో నాణ్యత పెరుగుతుంది. దీంతో రైతులకు అధిక దిగుబడులు పెరుగుతాయి. తాండూరులో అగ్రిహబ్ ఏర్పాటు చేయడం జిల్లా రైతులకు వరం.
– డాక్టర్ సుధాకర్, ప్రధాన శాస్త్రవేత్త, తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం