వికారాబాద్ నియోజకవర్గానికి నిధుల వరద పారుతున్నది. అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున మంజూరు చేస్తున్నది. ఇప్పటివరకు నియోజకవర్గానికి రూ.200 కోట్లపైనే అందించింది. ఇవేకాకుండా పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, వంతెనల నిర్మాణంతోపాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కింద రూ.వేల కోట్లు వెచ్చించింది. కేవలం వికారాబాద్ మున్సిపాలిటీకే రూ.176 కోట్ల నిధులిచ్చింది. వికారాబాద్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.96 కోట్లు మంజూరు చేసింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.10 కోట్లు ఇచ్చారు. మున్సిపాలిటీ, సీడీపీ, ఎస్డీఎఫ్, డీఎంఎఫ్టీల ద్వారా మరో రూ.30 కోట్లు నియోజకవర్గానికి అందాయి. వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధుల మంజూరులో స్థానిక ఎమ్మెల్యే చొరవతోపాటు జిల్లా ఇన్చార్జి మంత్రి పి.సబితారెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కృషి ఎంతో ఉన్నది.
-వికారాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ): ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో వెనుకబడిన వికారాబాద్ నియోజకవర్గం ప్రగతిపథంలో ముందుకు దూసుకెళ్తున్నది. ఈ ప్రాంత ప్రజల ఎన్నోఏండ్ల జిల్లా ఏర్పాటు కలను సీఎం కేసీఆర్ సాకారం చేయడంతోపాటు వికారాబాద్ జిల్లా అభివృద్ధిపై ఆయన ప్రత్యేక దృష్టిని సారించారు. మరీ ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గానికి గతంలో ఎన్నడూలేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా నిధులను కేటాయిస్తున్నది. ఇప్పటివరకు రైల్వేఓవర్ బ్రిడ్జి, మున్సిపాలిటీ, సీడీపీ, ఎస్డీఎఫ్, డీఎంఎఫ్టీల ద్వారా వికారాబాద్ సెగ్మెంట్కు రూ.200 కోట్లపైనే నిధులొచ్చాయి. ఇవేకాకుండా పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లు, వంతెనల నిర్మాణం, మరమ్మతులతోపాటు మిషన్ కాకతీయ, మిష న్ భగీరథ పథకాల కింద ప్రభుత్వం రూ.వేల కోట్ల నిధులను మంజూరు చేసింది.
అదేవిధంగా సీఎం కేసీఆర్ వికారాబాద్ సెగ్మెంట్ ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.10 కోట్లు ఇవ్వగా, నియోజకవర్గ అభివృద్ధి నిధులు రూ.8 కో ట్లు, కలెక్టర్ ప్రత్యేక నిధి నుంచి రూ.20 లక్షలు, జిల్లా గనుల ద్వారా వచ్చే ఆదాయం నుంచి మరో రూ.10 కోట్ల వరకు నిధులొచ్చాయి. అయితే కేవలం వికారాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికే ఇప్పటివరకు రూ.176 కోట్ల నిధులివ్వడం గమనార్హం. మరోవైపు గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలు గా పని చేసినా వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదు. అయితే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి న మెతుకు ఆనంద్ నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ వికారాబాద్ నియోజకవర్గాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. వికారాబాద్ సెగ్మెంట్ అభివృద్ధిలో జిల్లా ఇన్చార్జి మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కృషి కూడా ఎంతో ఉన్నది.
ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్న అధికారులు
ప్రభుత్వం మంజూరు చేసిన రూ.60 కోట్లతో వికారాబా ద్ మున్సిపాలిటీలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగనున్నది. ఇప్పటికే అధికారులు చేపట్టాల్సిన అభివృ ద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నా రు. మరోవైపు మున్సిపాలిటీలోని ఎన్టీఆర్ జంక్షన్, బీజేఆర్ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్లతోపాటు పార్కులు, కొత్తగడి వరకు పలు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. అంతేకాకుండా బ్లాక్గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ ఏర్పా టు, వాలీబాల్, బీచ్ వాలీబా ల్ కోర్టులను కూడా అభివృద్ధి చేయనున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్, డివైడర్ల ఏర్పాటు, నాలుగు వైపులా ఆర్చ్లనూ ఏర్పా టు చేయనున్నారు. మున్సిపల్లోని అన్ని వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధితోపాటు శివసాగర్ చెరు వు వద్ద మినీ ట్యాంక్బండ్ను ఏర్పాటు చేసి బోటింగ్ వసతిని కల్పించాలని నిర్ణయించారు.
వికారాబాద్ మున్సిపాలిటీకి రూ.176 కోట్లు..
వికారాబాద్ మున్సిపాలిటీ రూపురేఖలు పూర్తిగా మార నున్నాయి. ఇందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేస్తున్నది. ఇప్పటివరకు ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.176 కోట్లను విడుదల చేసింది. గతంలో ఈ మున్సిపాలిటీకి రూ.20 కోట్ల నిధులివ్వగా, తాజాగా రూ.156 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఎన్నో ఏండ్లుగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఆనిధుల్లోంచి రూ. 96 కోట్లను కేటాయించగా.. మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకోసం రూ.60 కోట్ల నిధులిచ్చింది. అయితే 40 ఏండ్లకుపైగా పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ని ర్మాణానికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిం ది.
ఈ బ్రిడ్జి నిర్మాణం విషయంలో ఎమ్మెల్యే ఆనంద్ చొరవ ఎంతో ఉన్నది. ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు త్వరగా బ్రిడ్జిని నిర్మించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డిని కోరగా వారు ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు రైల్వే ఓవర్ బ్రిడ్జికి మరమ్మతులు కాకుం డా కొత్తగా రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభు త్వం నిధులిచ్చింది. ఈ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం కూడా నిధులివ్వాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వకపోయినా సీఎం కేసీఆర్ ప్రభుత్వమే మొత్తం నిధులను మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 35 ఫీట్లతో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి రోడ్డు త్వరలో 70 ఫీట్ల మేర రో డ్డుగా ఏర్పాటు కానున్నది. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న రైల్వేఓవర్ బ్రిడ్జి ఎస్ క్రాసింగ్ను తీసేసి నేరు గా రోడ్డు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి..
వికారాబాద్ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా డెవలప్మెంట్ జరుగుతున్నది. సెగ్మెంట్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు.. నిధుల మం జూరుకు సహకరించిన జిల్లా ఇన్చార్జి మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డిలకు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. కేవలం మున్సిపాలిటీ అభివృద్ధికే ప్రభుత్వం రూ.156 కోట్లను మంజూరు చేయడం సంతోషకరం. గత 40 ఏండ్లుగా పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జిని కొత్తగా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులిచ్చి ప్రజల కష్టాలను తీర్చుతున్నది.
-డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే