చేవెళ్ల టౌన్ : తాగిన మైకంలో బండరాయితో మోది కన్నతల్లిని కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ సంఘటన చేవెళ్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెర గ్రామానికి చెందిన ధర్మపురం పాపమ్మ(75)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుతూళ్లు ఉన్నారు.
పాపమ్మ చిన్న కుమారుడు కిష్టయ్య మధ్యానికి బానిసై ప్రతి రోజు తాగి ఇంటికి వస్తున్నాడు. అయితే ప్రతి రోజు మద్యం తాగి ఇంటికి రావద్దని తల్లి మందలించడంతో పాపమ్మ నిద్రిస్తున్న సమయంలో కొడుకు కిష్టయ్య బండరాయితో మోది పాపమ్మను హత్య చేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.