ఆర్కేపురం, జూన్ 28 : పీ.వీ.నరసింహారావు దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. సోమవారం పీ.వీ. 101 జయంతి కార్యక్రమాన్ని గురుదత్త గ్యాస్ సర్వీసెస్ పీ.వీ.కిరణ్రావు, సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ వాణీదేవి హాజరై పీ.వీ. విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆసమానతలు లేని సమాజం ఏర్పాటు కోసం సంస్కరణలకు శ్రీకారం చుట్టిన గొప్ప మార్గదర్శకుడు పీ.వీ. నర్సింహారావు అని పేర్కొన్నారు. దేశ ప్రధానిగా ఎన్నో బృహత్ కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు.
ఆర్థిక సంస్కరణలకు ఆయన తనదైన ముంద్ర వేశారని తెలిపారు. పీ.వీ. గొప్ప రాజనీతిజ్ఞుడు, బహుభాషావేత్త, తెలంగాణ ముద్దుబిడ్డ, తొలి దక్షణాది ప్రధాని కావడ్డం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.