షాద్నగర్టౌన్, మే 01 : దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలమని ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్మికుల అభ్యున్నతికి తెలంగాణ సర్కార్ అహర్నిశలు కృషి చేస్తుందనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు.
తెలంగాణ సర్కార్ కార్మికుల సంక్షేమానికి ఎవరు ఊహించని విధంగా కృషి చేస్తూ వారికి అభివృద్ధి పెద్దపీట వేసిందన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించడంలో తెలంగాణ ముందుందన్నారు. అదే విధంగా రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడోచ్చన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలువాలన్నారు.
రక్తదానం చేసిన వారిని అభినందించడంతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలుచోట్ల జెండాలను ఎగురవేయడంతో పాటు ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ ఆహ్మద్తో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.