వికారాబాద్, ఆగస్టు 29, (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబం ధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి అమల్లోకి తీసుకొచ్చిన పీఎం-కిసాన్ పథకానికి నీలినీడలు మొదలయ్యాయి. రైతులకు పెట్టుబడి సాయా న్ని మేం కూడా అందిస్తున్నామం టూ కేంద్రం చెప్పుకోవడం తప్ప పథ కం అమలుకు మా త్రం ప్రాధాన్యత ఇ వ్వకపోవడం గమనార్హం. ఇప్పటికే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చే స్తున్న కేంద్రం పీ ఎం-కిసాన్ పథకా న్ని కూడా నిర్వీ ర్యం చేసేలా ఏదో ఒక కొర్రీలు పెడుతూ వస్తున్నది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్న రైతుబంధు పథకాన్ని ప్రతీ ఏటా అ ర్హులైన రైతుల సంఖ్య పెరుగుతూ ఉంటే… కేంద్ర ప్రభుత్వం మాత్రం నామమాత్రంగా పీఎం-కిసా న్ పథకాన్ని అమలు చేస్తూ ప్రతి ఏటా అర్హులైన రైతుల జాబితాను తగ్గిస్తూ వస్తున్నది. పీఎం-కిసాన్ పథకాన్ని కేంద్రం 2019లో అమల్లోకి తీసుకు రాగా ఇప్పటివరకు సగానికిపైగా అర్హుల జాబితాను తగ్గిస్తూ వస్తున్నారు. పీఎం-కిసాన్ పథకం లబ్ధిదారుల జాబితా నుంచి ప్రతి ఏటా తగ్గిస్తూ వస్తున్నారు. అయితే 2019లో పీఎం-కిసాన్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన కేంద్రం ప్రతీ ఏటా మూడు విడుతల్లో రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6వేల సహాయం అందిస్తున్నది.
అర్హులందరికీ రైతుబంధు సాయం…
కేంద్రం పీఎం కిసాన్ పథకం అర్హుల జాబితాను ఏదో ఒక కొర్రీ పెడుతూ తగ్గిస్తుంటే… రాష్ట్ర ప్రభు త్వం అందించే రైతుబంధు పథకం కింద అర్హుల జాబితా మాత్రం ప్రతి ఏటా పెరుగుతూ పోతున్నది. ఏ ఒక్కరిని విస్మరించకుండా ప్రతి రైతుకు కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు రూ.10వేల చొప్పు న పెట్టుబడి సహాయాన్ని అందజేస్తున్నది. అంతేకాకుండా రైతుబంధు పథకం అమల్లోకి తీసుకొచ్చిన నాటి నుంచి రైతులకు అప్పుల తిప్పలు తప్పినయ్. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ప్రతి ఏటా వానకాలం, యాసంగి సీజన్లకు కలిపి ప్రభుత్వం ఎకరాకు రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తుండడంతో పంట రుణాలకు బ్యాంకుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేసే రోజులకు ప్రభుత్వం చెక్ పెట్టింది.
రైతుబంధు పథకం కింద..
రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2,926 కోట్ల సాయాన్ని రైతులకు పెట్టుబడి నిమిత్తం అందజేశారు. అయితే 2018 వానకాలం సీజన్లో 1,94,833 మంది రైతులకు రూ.221 కోట్లు, యాసంగిలో 1,75,989 మంది రైతులకు రూ.206 కోట్లు, 2019 వానకాలం సీజన్లో 1,78,998 మందికి రూ.255 కోట్లు, యాసంగి సీజన్లో 1,71,824 మందికి రూ.194 కోట్ల పెట్టుబడి సాయాన్ని, 2020 వానకాలం సీజన్లో 2,113,341 మంది రైతులకు రూ.297 కోట్లు, యాసంగిలో 2,19,264 మంది రైతులకు రూ.301 కోట్ల పెట్టుబడిని, 2021 వానకాలం సీజన్లో 2,25,438 మంది రైతులకు రూ.300 కోట్లు, యాసంగి సీజన్లో 2,24,928 మంది రైతులకు రూ.241 కోట్ల పెట్టుబడి సహాయాన్ని అందజేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వానకాలం సీజన్లో 2,47,707 మంది రైతులకు రూ.305కోట్ల రైతుబంధు సహాయాన్ని, యాసంగిలో 2,43,447 మంది రైతులకు రూ.299 కోట్ల పెట్టుబడి సహాయాన్ని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో వానకాలం సీజన్లో 2,62,065 మంది రైతులకు రూ.307.47 కోట్ల పెట్టుబడి సహాయాన్ని ఎకరాకు రూ.5 వేల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
రైతు సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిదన్నరేండ్ల్ల పాలనలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్త్తూ వస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తును సరఫరా చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. రెండేండ్లలోనే విద్యుత్తు రంగంలో నవశకం మొదలయ్యిందనే విధంగా వ్యవసాయానికి ఉచిత 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నది. అలాగే ఏ విధం గా అయిన రైతు మృతి చెందితే ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి సీఎం కేసీఆర్ అండగా నిలుస్తూ రైతుబీమా పథకంలో భాగంగా రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నది.
వికారాబాద్ జిల్లాలో..
వికారాబాద్ జిల్లాలో పీఎం కిసాన్ పథకం అమల్లోకి తీసుకొచ్చిన అనంతరం మొదటి సారి 1,58,863 మంది రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించగా ప్రతి ఏటా కొంత మంది రైతులను తగ్గిస్తూ ప్రస్తుతం 69,352 మంది రైతులకు అర్హుల జాబితాను తగ్గించింది. గత ఐదేండ్లలో 89,511 మంది రైతులను పీఎం కిసాన్ పథకం అర్హుల జాబితా నుంచి తొలగించారు. అయితే ఇప్పటివరకు 14 విడుతల్లో పీఎం కిసాన్ కింద ఒక్కో విడుత కింద రూ.2 వేల చొప్పున అందజేస్తున్నది. ఇప్పటివరకు 14 విడుతల్లో పీఎం-కిసాన్ పథకం కింద అరకొర సాయమందించగా, జిల్లాలో మొదటి విడుతలో 1,58,863 మంది రైతులు పీఎం కిసాన్ ప థకానికి అర్హులుగా గుర్తించగా, రెండో విడుతలో 1,57,483 మంది రైతులు, మూడో విడుతలో 1,54,717, నాలుగో విడుతలో 1,50,713, ఐదో విడుతలో 1,49,380, ఆరో విడుతలో 1,47,785, ఏడో విడుతలో 1,45,49, 8వ విడుతలో 1,42,649, 9వవిడుతలో 1,38,268, 10వ విడుతలో 1,28,961, 11వ విడతలో 1,21,058, 12వ విడుతలో 1,09,902, 13వ విడుత లో 94,576, 14వ విడుతలో 69,352 మంది రైతులకు పీఎం కిసాన్ అర్హుల జాబితా తగ్గడం గమనార్హం.