యాచారం, నవంబర్16: ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని కుర్మిద్ద, తాటిపర్తి, నానక్నగర్, మేడిపల్లి, మల్కీజ్గూడ, తక్కళ్లపల్లితండా, తక్కళ్లపల్లి, కొత్తపల్లి గ్రామాలలో గురువారం ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే కిషన్రెడ్డి ప్రచారానికి గ్రామ గ్రామాన ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ…రాష్ట్రం రాకాసుల పాలు కాకుండా బాగుండాలంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే కేసీఆర్ ధ్యేయమన్నారు.
రాష్ట్రంలో రానున్న ఎన్నికల ద్వారా అవినీతి కాంగ్రెస్ను అంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలోనే ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చేందాలంటే బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే రైతులకు కన్నీళ్లే మిగులనున్నాయన్నారు. ఎన్నికల్లో తమ ఓటు ద్వారా కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాను దొంగలపాలు చేయొద్దన్నారు. నూతనంగా ప్రవేశ పెట్టిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. మేడిపల్లిలో 5.80కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు.
ఐదేండ్లకోసారి ఎన్నికల ముందు ప్రజల వద్దకు వచ్చే మల్రెడ్డి రంగారెడ్డి మాటలకు మోసపోవద్దన్నారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ మాట్లాడుతూ..కాంగ్రెస్ కుట్రలను ఓటుతోనే తిప్పి కొట్టాలన్నారు. మంచిరెడ్డిని నాలుగోసారి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి పాచ్ఛ భాష, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, సర్పంచ్లు శ్రీనివాస్రెడ్డి, జగదీశ్, సంతోష, హబీబుద్దీన్, ఎంపీటీసీలు రవికిరణ్రెడ్డి, శివలీల, శారద, సుమతమ్మ, తలారి మల్లేశ్, యాదయ్యగౌడ్, చిన్నోళ్ల యాదయ్య, శంకర్నాయక్, మద్దెల శశికళ, స్వరూప, రామచంద్రయ్య, సంగం రాజు, సత్తమ్మ, ఖాజు, గోపాల్, వెంకటేశ్, శంకర్గౌడ్, మొరుగు రమేశ్, అచ్చన దానయ్య, అబ్బయ్య, అనంతరెడ్డి కార్యకర్తలు ఉన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపుకై కార్యకర్తలు, నాయకులు కలిసిరావాలని ఆయన కుమార్తె శీతల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రతిక్షణం ప్రజలకు మంచిచేసే మంచిరెడ్డి కిషన్రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ బల్వంత్రెడ్డి, ఎంపీటీసీలు అచ్చన శ్రీశైలం, జ్యోతి, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు బాలు, నాయకులు బుయ్యని సుధాకర్గౌడ్, అశోక్గౌడ్, నర్సింహగౌడ్, సురేందర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఆదిబట్ల : బొంగుళూరు, ఆదిబట్ల, ఎంపీ పటేల్గూడ, కొంగరకలాన్, మంగల్పల్లి గ్రామాల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు కొప్పు జంగయ్య, కౌన్సిలర్ నారని మౌనిక తదితరులు పాల్గొన్నారు.
మంచాల : మండల పరిధిలోని ఎల్లమ్మతండా, బోడకొండ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిథులు జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, మ్యానిఫెస్టోను వివరించారు. మరింత అభివృద్ధి చెందాలంటే మంచిరెడ్డి కిషన్రెడ్డికి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో నర్సింగ్ అనిత, సుకన్య, బద్రినాథ్గుప్తా తదితరులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట : బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీటీసీ గ్యార బాల లింగస్వామి అన్నారు. గురువారం అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని గౌరెల్లి గ్రామం, కృష్ణానగర్లో ఉపసర్పంచ్ వేముల చంద్రశేఖర్, ఇతర నాయకులతో కలిసి ఆయన భారీఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి మ్యానిఫెస్టో గురించి వివరించారు. మరిన్ని ప్రగతి పనుల కోసం మరోసారి మంచిరెడ్డి కిషన్రెడ్డిని గెలిపించాలని కోరారు. మరోసారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విన్నవించారు. గ్రామంలో అభివృద్ధి చేసిన ఘనత కిషన్రెడ్డికే దక్కుతుందని చెప్పారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు గ్యార నర్సింగ్రావు, లెక్కల వెంకట్రెడ్డి, గ్యార లింగస్వామి, అచ్చయ్య, శ్రీనివాస్, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.
తుర్కయంజాల్ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థ్ధి,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని ఎమ్మెల్యే కోడలు మంచిరెడ్డి మౌనిక అన్నారు. మున్సిపాలిటీలో మంచిరెడ్డికి మద్దతుగా కౌన్సిలర్ కీర్తనతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం కాలనీ వాసులతో సమావేశం ఏర్పాటు చేసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు కార్తీక్, మహిళా విభా గం అధ్యక్షురాలు అశ్విని, నాయకులు దశరథ, బాబయ్య, ఆర్ల కృష్ణ, టీఎన్ దాస్ గౌడ్, విజయానంద్రెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్, శ్రీశైలం, నరేందర్ పాల్గొన్నారు.