షాబాద్, ఏప్రిల్ 17: ప్రజల కంటి సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభి స్తున్నది. సోమవారం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో 80 బృందాల ద్వారా 12,783 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 1,088 మందికి కంటి అద్దాలు అందజేయగా 917 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం వైద్యులు ఆర్డర్ చేశారు. కంటి వెలుగు క్యాంపులు సజావుగా సాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అవసరము న్న వారికి కంటి అద్దాలతోపాటు మందులను ఉచితంగా అందిస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో 4,924 మందికి..
బొంరాస్పేట, ఏప్రిల్ 17 : అంధత్వం, కంటి జబ్బుల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారం భించిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా సాగుతు న్నది. నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చిన వారి కి జిల్లాలోని 42 క్యాంపుల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు, అద్దాలను పంపిణీ చేస్తున్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. కాగా సోమవారం జిల్లాలో 4,924 మందికి కంటి పరీక్షలు చేయగా.. వారిలో 573 మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేశారు. 643 మం దికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ఇది లా ఉండగా జిల్లాలో ఇప్పటివరకు 326 గ్రామా లు, 66 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలను నిర్వ హించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
పేదల జీవితాల్లో వెలుగులు..
తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గతంలో ఏ ప్రభు త్వం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. పేదల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్.. అందుకే ఇంత మంచి కార్యక్రమాన్ని అమలు చేసి ఉచితంగా పరీక్షలు చేయడంతోపాటు అవసరమైన మందులు, కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు క్యాంపులకు విశేష ఆదరణ వస్తున్నది.
– పి.రమేశ్, ఇబ్రహీంపల్లి గ్రామం, చేవెళ్ల మండలం
కంటి పరీక్షలు చేశారు
కంటి వెలుగు కార్యక్రమం పేదలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నది. నేను చదువుకునే సమయంలో కండ్లు కొంత మబ్బుగా కనిపిస్తున్నాయి. దీంతో మా గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరానికి రాగా.. పరీక్షించిన వైద్యులు అవసరమైన కండ్లద్దాలు తెప్పించి ఇస్తామని చెప్పారు. ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన అద్దాలు, మందులు ఇస్తుండటం చాలా బాగుంది.
– మయూరి, విద్యార్థిని