మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తున్నది. బ్యాంకు లింకేజీ ద్వారా సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగత రుణాలనూ మంజూరు చేస్తున్నది. దీంతో మహిళా సంఘాల సభ్యులు కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం, గేదెలు, గొర్రెలు, మేకలను కొనుగోలు చేయడం, కూరగాయల వ్యాపారం చేసుకునేందుకుగాను అధికంగా ఆసక్తి చూపుతున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం రూ.538.27 కోట్ల వడ్డీలేని రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రూ.396.80 కోట్ల రుణాలను ఎస్హెచ్జీలకు ప్రభుత్వం అందజేసింది. అనుకున్న లక్ష్యానికి 73.72 శాతం రుణాలు మంజూరు చేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలోగా నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో స్వయం సహాయక సంఘానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తూ చేయూతనందిస్తున్నది. సంఘాల పనితీరును బట్టి పలు సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.20 లక్షల వరకు రుణాలను మంజూరు చేయడం గమనార్హం.
– వికారాబాద్, ఫిబ్రవరి 2, (నమస్తే తెలంగాణ)
ఎస్హెచ్జీలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత
వికారాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. వారికి వడ్డీ లేని రుణాలతోపాటు స్వల్ప కాలిక రుణాలను అం దిస్తూ చేయూతనిస్తున్నది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో వికారాబాద్ జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల(ఎస్హెచ్జీ)కు రూ. 538.27 కోట్ల వడ్డీలేని రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అయి తే ఇప్పటివరకు రూ.396.80(73.72 శాతం) రుణాలను మంజూరు చేయగా..మిగిలిన మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు అందించేందు కు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే గతేడాది రూ.361 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. లక్ష్యానికి మించి రూ.371.49 కోట్ల రుణాలను బ్యాంకర్లు ఎస్హెచ్జీలకు అందించారు.
జిల్లాలో 657 గ్రామ సంఘాలుండగా, 13,213 స్వయం సహాయక సంఘాలున్నాయి. అందులో 1.80 లక్ష ల మంది సభ్యులున్నారు. రుణాలను సకాలంలో చెల్లిస్తున్న స్వయం సహాయక సంఘాలకు అధికారులు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ సంఘాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు తోడ్పాటునందిస్తున్నారు. ఒక్కో స్వయం సహాయక సంఘానికి రూ.5 నుంచి రూ.10లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు. సంఘాల పనితీరును బట్టి ఈ ఆర్థిక సంవత్సరం రూ.20 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తుండటం గమనార్హం.
ఇప్పటివరకు రూ.396.80 కోట్ల రుణాలు మంజూరు
ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్హెచ్జీలకు రూ. 538 కోట్లను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటివరకు రూ. 396.80(73.72 శాతం మేర) కోట్ల రుణాలను చెల్లించారు. అందులో అత్యధికంగా కోట్పల్లి మం డలంలో 89.27శాతం, వికారాబాద్ మండలం లో 82.74 శాతం, బషీరాబాద్ మండలంలో 82.50, నవాబుపేటలో 82.07, బంట్వారంలో 81.12, మోమిన్పేటలో 79.11, మర్పల్లిలో 78, కొడంగల్లో 77, పూడూరులో 73.45, పెద్దేముల్లో 72.55, చౌడాపూర్ మండలంలో 71.29 శాతం మేర బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేశారు. మిగిలిన మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు జిల్లాలోని అన్ని మండలాల్లో రుణాలను మంజూరు చేసేందుకు డీఆర్డీఏ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు 7,167 స్వయం సహాయక సంఘాలకు రూ.396.80 కోట్ల రుణాలను అధికారులు మం జూరు చేశారు.
దోమ మండలంలో రూ. 30.04 కోట్లు, కులకచర్ల మండలంలో రూ. 22.54 కో ట్లు, యాలాల మండలంలో రూ. 22.04 కోట్లు, తాండూరు మండలంలో రూ.23.06 కోట్లు, బొంరాస్పేట మండలంలో రూ.24.16 కోట్లు, మోమిన్పేట మండలంలో రూ.25.57 కోట్ల రుణాలను మంజూరు చేశారు. అదేవిధంగా అధికారులు పని చేయని సంఘాలు, రుణాలను సక్రమంగా చెల్లించని సంఘాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వారికి అవగాహన కల్పిస్తూ రుణాలను చెల్లించాలని సూచిస్తున్నారు.
అదేవిధంగా స్త్రీనిధి రుణాలకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం రూ.78.30 కోట్ల రుణాలను మంజూరు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 50 శాతం మేర అంటే రూ. 38.86 కోట్ల రుణాలను మంజూరు చేశారు.
వంద శాతం మంజూరు చేస్తాం
ఈ ఆర్థిక సంవత్సరం లో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వందశా తం రుణాలను మం జూరు చేయాలని నిర్ణయించి.. ఇప్పటివరకు 73.72 శాతం వరకు పంపిణీ చేశాం. మిగిలిన రుణాలను ఆర్థిక సంవత్సరం పూర్తి అయ్యేలోపు అందించేందు కు చర్యలను తీవ్రం చేశాం. ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో స్వయం సహాయక సంఘా ల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు.
– కృష్ణన్, డీఆర్డీవో వికారాబాద్