హయత్నగర్, జూన్ 23 : యూటర్న్ తీసుకుంటుండగా స్కూటీని వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హయత్నగర్ డివిజన్ పరిధిలోని వస్పరినగర్ కాలనీలో తిరుపతి సత్యనారాయణ, కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.
సత్యనారాయణ వృత్తిరీత్యా వ్యాపారం చేస్తుంటాడు. సత్యనారాయణ హయత్నగర్ నుంచి ఎల్బీనగర్ వైపు తన స్కూటీ పై బయలుదేరాడు. మార్గమధ్యలో భారత్ బెంజ్ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా అతివేగం దూసుకొచ్చిన లారీ బైక్ను ఢీకొట్టింది. ఈఘటనలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కుమారుడు విజయ్ భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.