కొత్తూరు, మే10 : బండారాయితో కొట్టి ఓ వ్యక్తిని దారుణఃగా హత్య చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. కొత్తూరు ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందని దిలీప్ బొబాడే (35) కొత్తూరులో గత రెండేండ్లుగా అడ్డ కూలీగా పనిచేస్తున్నాడు. అయితే సోమవారం రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొత్తూరు ఎన్హెచ్ 44 అండర్ పాస్ కింద దిలీప్ బిబాడేను బండరాయితో కొట్టి చంపి పడవేశారు.
అయితే అతడు ఇంతకు ముందు పనిచేసిన దగ్గర బాగా అప్పులు చేశాడని అతని వెంట పనిచేసే కొందరి చెప్పినట్లు సమాచారం. అతని తోటి కూలీ జగన్ బొబాడే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.