సర్వమతాలకు సమ ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల పండుగలకు సహకారాన్ని అందిస్తున్నది. పండుగ పూట పేదలు సంతోషంగా గడుపాలన్నదే సర్కారు సదుద్దేశం. బతుకమ్మ చీరలు, రంజాన్కు దుస్తులు అందజేస్తున్నట్లుగానే క్రిస్మస్ వేడుకల సందర్భంగా పేద క్రైస్తవులకు గిఫ్ట్లు పంపిణీ చేసేందుకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాకు 3వేల గిఫ్ట్ ప్యాక్లు, వికారాబాద్ జిల్లాకు 4 వేల గిఫ్ట్ ప్యాక్లు రాగా, గోదాముల్లో భద్రపరిచారు. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి గిఫ్ట్లను ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గిఫ్ట్ల పంపిణీ సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో నిర్వహించే కార్యక్రమాల కోసం రూ.6 లక్షలు, వికారాబాద్ జిల్లాలోని తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో నిర్వహించే కార్యక్రమాలకు 8 లక్షల నిధులను సైతం ప్రభుత్వం మంజూరు చేసింది.
షాబాద్, డిసెంబర్ 12 : క్రైస్తవులకు తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుకలను అందించేందుకు సిద్ధం చేసింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రంగారెడ్డిజిల్లాకు 3వేల కానుకలు అందించనున్నది. కార్యక్రమ నిర్వహణ కోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.2లక్షల చొప్పున జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం రూ.6 లక్షలు మంజూరు చేసింది. జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో పేద క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
సర్వమతాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల పండుగలకు చేయూతనిస్తున్నారు. బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు, రంజాన్కు ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసినట్లుగానే క్రిస్మస్ వేడుకల కోసం క్రైస్తవులకు కానుకలు అందించేందుకు సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లాకు చేరిన కానుకలను గోదాముల్లో భద్రపరిచారు. త్వరలో వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని భావించిన సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి పేదలకు అండగా నిలుస్తున్నారు. హిందువులకు బతుకమ్మ, ముస్లింలకు రంజాన్ సందర్భంగా కానుకలు అందించినట్లే క్రిస్టియన్లకు క్రిస్మస్ సందర్భంగా దుస్తులు, విందు భోజనాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దుస్తుల కిట్లు ఇప్పటికే జిల్లాకు చేరగా త్వరలో పంపిణీ చేసేందుకు మైనార్టీ సంక్షేమ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అర్హులైన లబ్ధిదారులకు క్రిస్మస్ కానుకలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా మండలాల తహసీల్దార్లు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తూ అర్హులైన పేద క్రిస్టియన్లను ఎంపిక విధానాన్ని పర్యవేక్షిస్తారు. వీరి సమక్షంలో నియోజకవర్గాల వారీగా పాస్టర్లతో సమావేశం నిర్వహించి ఆయా మండలాల్లో పేద క్రిస్టియన్లకు కిట్లను అందించనున్నారు. ఒక్కో కిట్లో చీర, ప్యాంట్, షర్ట్, పంజాబీ డ్రెస్ మెటీరియల్ ఉంటాయి. జిల్లా కేంద్రం నుంచి ఆయా మండల రెవెన్యూ అధికారులకు కానుకలు చేరాక, రేషన్ కార్డు కలిగిన అర్హులైన క్రిస్టియన్లకు వాటిని పంపిణీ చేయనున్నారు. ప్రతి గ్రామంలో స్థానిక పాస్టర్, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో క్రిస్మస్ కానుకలను లబ్ధిదారులకు అందజేస్తారు.
వికారాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టమస్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవ సోదరులకు ప్రత్యేక కానుకలను (దుస్తులు) అందజేయనుంది. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు 4వేల కానుకలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలలోని తహసీల్దార్లు కానుకలను గోదాముల్లో భద్రపర్చారు. వికారాబాద్ ఆర్డీవో వికారాబాద్ నియోజకవర్గానికి, తాండూరు ఆర్డీవో తాండూరు నియోజకవర్గానికి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ కొడంగల్ నియోజకవర్గానికి, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పరిగి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులుగా కలెక్టర్ నియమించారు. లోకల్ అధికారులుగా తహసీల్దార్లను నియమించి, పాస్టర్ల ద్వారా సమావేశాలు జరిపించాల్సి ఉంటుంది. మొదటగా హెచ్ఐవీ బాధితులు, అనాథలు, వితంతువులు, దివ్యాంగులు, నిరుపేదలు, అత్యంత నిరుపేదలను ఎంపిక చేయాలి. వారికి మంత్రి, శాసన సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో కానుకలను పంపిణీ చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో వేడుకలను నిర్వహించుటకు రూ.2లక్షల చొప్పున రూ.8లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
పెద్దేముల్, డిసెంబర్ 12 : మండల పరిధిలోని గాజీపూర్ గ్రామంలో మూడు రోజులుగా కొనసాగిన గ్రామ దేవత ఊరడమ్మ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా చివరి రోజు బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు ప్రత్యేకంగా తయారుచేసిన నైవేద్యంతోపాటు, బోనాలను గ్రామ ప్రధానవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. బోనాల ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. యువకులు ఉత్సాహంతో నృత్యాలు చేశారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. రాత్రి వేళ కర్ణాటక భజన బృందంచే భజన కార్యక్రమం, సంకీర్తనలు, భజన పాటలు వైభవంగా నిర్వహించారు.
ఒక్కో నియోజవర్గానికి వెయ్యి చొప్పున జిల్లాకు 3వేల కానుకలు వచ్చాయి. వీటిని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాం. కానుకల పంపిణీ రోజున ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమం నిర్వహణ కోసం నియోజకవర్గానికి రూ.2లక్షల చొప్పున జిల్లాకు మొత్తం రూ.6లక్షలు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు త్వరలో గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.