బొంరాస్పేట, మార్చి 21 : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అం దించింది. సెర్ప్లో పని చేస్తున్న ఉద్యోగులకు కొత్త పేస్కేల్ను వర్తింపజేస్తూ ప్రభుత్వం శనివారం జీవో 11ను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు రావడంతోపాటు డీఏ, పదోన్నతులు కూడా వర్తించనున్నా యి. గ్రామాల్లో ఐకేపీ మహిళా సంఘాల బలోపేతానికి, గ్రామీణ పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న తమ సేవలను సీఎం కేసీఆర్ గుర్తించి పేస్కేల్ ప్రకటించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, తమకు ఉగాది కానుక అందించారని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త పేస్కేల్ అమలుతో సెర్ప్ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరుగనున్నాయి. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో తమ బాగోగులను ఏ సర్కారు కూడా పట్టించుకోలేదని.. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు అండగా ఉన్నదని హర్షం వ్యక్తం చేస్తూ వికారాబాద్ జిల్లాలోని సెర్ప్ ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పీఎఫ్ సౌకర్యం పొందుతున్న సెర్ప్ సిబ్బంది భవిష్యత్తులో తమకు డీఏ, పదోన్నతులు రానున్నాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో 189 మందికి లబ్ధి
సెర్ప్ ఉద్యోగులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి పేస్కేల్ను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వికారాబాద్ జిల్లాలో 189 మంది సెర్ప్ ఉద్యోగులకు ప్రయో జనం కలుగనున్నది. జిల్లాలోని సెర్ప్ విభాగంలో ఒక ప్రాజెక్ట్ మేనేజర్, ఐదుగురు డీపీఎంలు, 23 మంది ఏపీఎంలు, 61 మంది మండల సమాఖ్య సీసీలు, 95 మం ది సీసీలు, నలుగురు సపోర్టింగ్ స్టాఫ్ పని చేస్తున్నారు. వీరందరికీ పే స్కేల్ అమలు కానున్నది.
పరిగి, మార్చి 21: సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సం తోషంగా ఉన్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ను వర్తింపజేస్తూ జీవోను జారీ చేయడాన్ని హర్షిస్తూ మంగళవారం పరిగిలోని మండల సమాఖ్య వద్ద ఎమ్మెల్యే మహేశ్రెడ్డితో కలిసి సెర్ప్ ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తు న 90 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తున్నదని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలోనే ఉద్యోగులకు అధికంగా వేతనాలు అందుతున్నాయన్నారు. సెర్ప్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అర్హులకు ఇంటి స్థలాలు.. లేదంటే గృహలక్ష్మి పథకం క్రింద ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డిని నియో జకవర్గంలోని పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు మండలాల సెర్ప్ ఉద్యోగులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
చిత్తశుద్ధితో పనిచేస్తాం..
2000 సంవత్సరం నుంచి తక్కువ వేతనాలతో కుటుంబా లను నెట్టుకొస్తున్నాం. మాకు పే స్కేల్ను అమలు చేయా లని నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్ సార్కు రుణ పడి ఉంటాం. ప్రభుత్వపథ కాలను పేదలకు చేరవేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తాం.
-సునీత సీసీ, బొంరాస్పేట మండలం
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం
సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. గత 23 ఏండ్లుగా చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నాం. తమ ఇబ్బం దులను సీఎం కేసీఆర్ గుర్తించి.. వేతనాలు పెంచి ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడం చాలా సంతోషంగా ఉన్నది.
-అంజిలయ్య, ఏపీఎం, బొంరాస్పేట
మాకు శుభదినం
పే స్కేల్ వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం చాలా సంతోషకరం. ఇది సెర్ప్ ఉద్యోగులకు శుభ దినం. 23 ఏండ్లుగా పేద నిర్మూలనకు గ్రామాల్లో ఎంతో కృషి చేస్తున్నాం. పేదలకు చేస్తున్న సేవను ప్రభుత్వం గుర్తించినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు ఉద్యోగుల్లో అభద్రతాభావం పోయి బాధ్యత పెరిగింది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
-సాయన్న, ఏపీఎం దౌల్తాబాద్
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం..
సెర్ఫ్ ఉద్యోగులకు పేస్కేలును వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరం. ఎన్నో ఏండ్ల నుంచి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నాం. మాకు వస్తున్న జీతంతో మార్కెట్లో ఏదీ కొనలేకపోతున్నాం. ప్రభు త్వం మాపైన దయ ఉంచి పేస్కేల్ను వర్తింపచేయాలని నిర్ణయించడం ఆనందంగా ఉంది.
-పిట్ల యాదయ్య, ఐకేపీ సీసీ, బొంరాస్పేట