కేశంపేట, సెప్టెంబర్ 28: రాష్ట్రంలోని మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని కొత్తపేట ఊరచెరువు, కొండారెడ్డిపల్లి పెద్దచెరువుల్లో ఎమ్మెల్యే ప్రభుత్వం అందజేసిన చేపపిల్లలను వదిలారు. రాష్ట్ర సర్కార్ మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపట్టడంతో వర్షాలతో చెరువుల్లోకి నీరు చేరి మత్స్యసంపద పెరిగిందని, తద్వారా మత్స్యకారులకు మంచి ఉపాధి లభిస్తుందన్నారు. చెరువుల ద్వారా లభిస్తున్న చేపలతో మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం అందజేసిన చేప పిల్లలను మత్స్యకారులు పెంచి పోషించి వృద్ధిలోకి రావాలని సూచించారు. ఆయా గ్రామాల చెరువుల్లో చేపలను వదలడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నవీన్కుమార్, ఎంపీటీసీ మల్లేశ్యాదవ్, రమాదేవి, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, ఏఎంసీ మాజీ వైస్చైర్మన్లు లక్ష్మీనారాయణగౌడ్, నారాయణరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, నాయకులు పల్లె నర్సింగ్రావు, ప్రభాకర్రెడ్డి, శేఖర్పంతులు, తిరుమలరెడ్డి శ్రీనివాస్, యాదయ్యగౌడ్, కుమార్గౌడ్, లక్ష్మయ్య, ప్రేమ్కుమార్గౌడ్, జగన్రెడ్డి, దశరథ్లతో పాటు మత్స్యకారులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి పేదలకు వరం
షాద్నగర్టౌన్, సెప్టెంబర్ 28 : పేదలకు సీఎం సహాయనిధి వరంలా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ పట్టణం మల్లికార్జునకాలనీకి చెందిన సాయిసౌజన్యకు రూ. 2లక్షలు, ఫరూఖ్నగర్కు చెందిన అబ్దుల్ బాసిత్కు రూ.2లక్షలు, లక్ష్మీనర్సింహాకాలనీకి చెందిన హర్షినికి రూ. 2లక్షలు, క్రిస్టియన్కాలనీ చెందిన ఠాకూర్ బాలాజీసింగ్కు రూ.2లక్షలు, పటేల్రోడ్డుకు చెందిన పర్వీన్బేగానికి రూ. 20వేల సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. సీఎం సహాయనిధితో కార్పొరేట్స్థాయిలో వైద్యం పొందుతున్నారన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్ వెంకట్రాంరెడ్డి, జీ.టీ శ్రీనివాస్, ప్రతాప్రెడ్డి, నాయకులు నారాయణరెడ్డి, వెంకట్రెడ్డి, ఏజాజ్, అశోక్ పాల్గొన్నారు.