సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి అంటే తొలుత గుర్తుకు వచ్చేది పతంగులు. వీటిని ఎగురవేయడానికి చిన్నాపెద్ద ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. దీంతో నగరంలోని కోఠి, అబిడ్స్, ధూల్పేట్, మంగళ్హాట్, సుల్తాన్బజార్, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్, ప్యాట్నీ, అమీర్పేట్, హైటెక్సిటీ, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో షాపులన్నీ కైట్స్తో కళకళలాడుతున్నాయి.
చిన్నారులను, పెద్దలను ఆకర్శించేలా తీరొక్క డిజైన్స్తో పతంగులను తయారుచేసి మార్కెట్లో విక్రయానికి ఉంచారు. నచ్చిన కైట్ను కొనుగోలు చేస్తున్న నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.