హైదరాబాద్, జూలై 29(నమస్తే తెలంగాణ) : నిజాం కాలేజీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫీజుల పేరుతో సర్టిఫికెట్ల బ్లాక్ మెయిలింగ్ దందా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్ల రా ష్ట్రంలో విద్యావ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. హైదరాబాద్లోని నిజాం కళాశాల, కోఠి ఉమెన్స్ కళాశాల, సైఫాబాద్ సైన్స్ కళాశాల, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల ప్రిన్సిపాళ్లు త మ సంస్థలను ప్రైవేట్ ఎస్టేట్లుగా మార్చుకున్నారని వి మర్శించారు. కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థుల టీసీలు, ప్రొవిజనల్, మార్కుల మెమోలను అడ్డుపెట్టి బలవంతపు వసూళ్ల కు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను రాబట్టుకోలేక, ఆ కక్షను విద్యార్థులపై చూప డం దారుణమని మండిపడ్డారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాలను క ళాశాలల యాజమాన్యాలు తుంగలో తొకుతున్నాయ ని దాసోజు ఎండగట్టారు. బకాయిల నెపంతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను తాకట్టు పెట్టుకోవడం లేదా నిలిపివేయడం నేరమని, ఇది ప్రాథమిక హకుల ఉల్లంఘన కిందికి వస్తుందని స్పష్టంచేశారు. సర్టిఫికెట్లు రాకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు పీజీ, పీహెచ్ డీ ప్రవేశాలు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈ అంశాలపై ఇప్పటికే గవర్నర్, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ, ఉన్నత విద్యామండలి చైర్మన్లకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని సర్టిఫికెట్లను ఇప్పించాలని, లేకపోతే బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు.
1. బకాయిలతో సంబంధం లేకుండా అన్ని ప్రభుత్వ, అటానమస్ కళాశాలల్లో నిలిపివేసిన ఒరిజినల్ సర్టిఫికెట్లను వెంటనే అందజేసేలా విద్యాశాఖ సర్యులర్ జారీ చేయాలి.
2. నిబంధనలను ఉల్లంఘించి విద్యార్థులను భయపెడుతున్న ప్రిన్సిపాళ్లపై విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.
3. వేలాది కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపునకు స్పష్టమైన కాలపరిమితితో షెడ్యూల్ ప్రకటించాలి.
4. వేధింపులను ఎదురొంటున్న విద్యార్థుల కోసం ప్రత్యేక ఫిర్యాదుల పరిషార వ్యవస్థను ఏర్పాటుచేయాలి.