అనేక విశిష్టతలతో, ఎన్నెన్నో హంగులతో ముస్తాబైన రాష్ట్ర సచివాలయం ఆదివారం ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం నుంచే పండుగ సందడి కనిపించింది. ఒక పక్క భవనాన్ని పువ్వులతో ముస్తాబు చేస్తుండగా. మరో పక్క భవనం ముందు నిలబడి ఫొటోలు తీసుకోవడానికి స్థానికులు పోటీ పడ్డారు. ఈ భవనాన్ని చూడడానికి, ఫొటోలు దిగడానికి అనేకమంది తరలిరావడంతో పరిసరాలు సందడిగా మారాయి.