నందిగామ, జనవరి 8 : సీఎం కేసీఆర్ లాంటి గొప్ప విజన్ ఉన్న నాయకుడి నాయకత్వమే దేశానికి ఎంతో అవసరమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీర్ల శ్రీశైలం, బీర్ల భీమయ్య, బీర్ల చంద్రయ్య, బీర్ల రమేశ్, కుర్వ రాజు, జాకారం శ్రీను, పాల్కొండ రంజిత్లు ఆదివారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో అమలయ్యే సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలంటే సీఎం కేసీఆర్తోనే సాధ్యమన్నారు. దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పద్మారెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, సర్పంచ్ రమేశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు మంజులారెడ్డి, తోట రాజ్గోపాల్, బీఆర్ఎస్ నాయకులు గోవు రవియాదవ్, తోట భాస్కర్, కట్న శ్రీశైలం, బేగ్, మహేందర్, గణేశ్, చంద్రశేఖర్, పాండు తదితరులు పాల్గొన్నారు.
నందిగామ మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన ఓజిని నర్సింహులుకు రూ.లక్ష, దుబ్బ అక్షితకు రూ.49 వేలు, రంగాపూర్ గ్రామానికి చెందిన తోట జంగయ్యకు రూ.32 వేలు విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ లబ్ధిదారులకు అందజేశారు.
షాద్నగర్రూరల్ : మన సంస్కృతీ సంప్రదాయాలను మరవద్దని, మహిళలు ఇష్టపడే పండుగల్లో సంక్రాంతి ఒకటని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. వీరశైవ మహిళా సమాజం షాద్నగర్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని శివమారుతి గీతా అయ్యప్ప మందిరం ఆవరణలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. వీరశైవ సమాజం ఆధ్వర్యంలో పలు సేవా, సంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ముగ్గుల పోటీలో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్, కౌన్సిలర్ మహేశ్వరి, జడ్పీటీసీ తాండ్ర విశాల, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వం, షాద్నగర్ వీరశైవ సమాజం అధ్యక్షుడు బొబ్బిలి ప్రవీణ్, మహిళళా అధ్యక్షురాలు ప్రసన్నంబిక, శైలజ, సమాజం సభ్యులు పాల్గొన్నారు.