కొడంగల్/ దౌల్తాబాద్ డిసెంబర్ 4: నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చేస్తున్న కృషికి ఆకర్షితులై ఆయా పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దౌల్తాబాద్ మండలంలోని కాంగ్రెస్ నాయకులు టీఆర్ ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గ అభి వృద్ధే ప్రధాన లక్ష్యమన్నారు.
పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని వారి అభ్యున్నతికి వెన్నం టి ఉంటానన్నారు. పార్టీలో చేరుతున్న ప్రతి కార్యకర్త పార్టీ ప్రతిష్టతకు పాటుపడాలని తెలిపారు. పార్టీలో చేరిన దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కేశవరెడ్డి, నరోత్తం రెడ్డి, గోపాల్తో పాటు మరో 20మందిని పార్టీ కండువాతో టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిం చారు. కాంగ్రెస్లో ఇమడలేక, నాయకుడి మూర్ఖత్వ వైఖరికి నిరసిస్తూ టీఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నట్లు టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పథకంతో నిరుపేదలు సైతం కార్పొరేట్ వైద్యసేవలను పొందుతున్నారని తెలిపారు.
నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో కొనసాగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించి అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు, సలహాలను అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్రావు యాదవ్, బొంరాస్పేట పీఏసీఎస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డితో పాటు టీఆర్ఎస్ నాయకులు నరోత్తం రెడ్డి, చాంద్పాషా పాల్గొన్నారు.