తాండూరు రూరల్ : గుర్తు తెలియని శవం లభ్యమైన సంఘటన కరోణ్కోట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివానం ఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాళప్ప వ్యవసాయ బావిలో ఓ వ్యక్తి (50) శవమై ఉన్నట్లు గుర్తించారు. మృతుడి శవంపై తెల్లచొక్కా, నల్లని చారల బనియన్, ఉందని తెలిపారు. కాలకృత్యాలకు వెళ్లి బావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.