ఆమనగల్లు : మండలంలోని శెట్టిపల్లిలో అలివేలు మంగా సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుత్నున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో సోమవారం స్వామి కల్యాణం కన్నుల పండువగా కొనసాగింది. ఉత్సవాలను పురస్కరించుకొని ఉత్సవ మూర్తి విగ్రహాలను డప్పుడచప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయ చైర్మన్ సింగిని శ్రీనివాస్, సర్పంచ్ గోధాదేవిసత్యంలు మండపానికి తీసుకొచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు నవీన్శర్మ ,శ్రీకాంత్శర్మ, దినేష్శర్మ, గోపీ శర్మలు స్వామి వారి కల్యాణ తంతును కొనసాగించారు.
మంగళ వాయిధ్యాలు, వేదమంత్రాల సాక్షిగా అలివేలు మంగా సమేతా వెంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహించారు. సర్పంచ్ గోధాదేవి సత్యం, సింగిని శ్రీనివాస్, కోట్ల సంధ్య, జగన్మోహన్ దంపతులు ఉత్సవ తంతువులో పాలు పంచుకొన్నారు. కల్యాణాన్ని తిలకించేందుకు శెట్టిపల్లి గ్రామంతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్, మాడ్గుల మండలం, కడ్తాల మండలంలోని పలు గ్రామాల నుంచి భక్తులు తరలి వచ్చారు.
ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఏఎంసీ వైస్ చైర్మన్ తోటగిరియాదవ్, జడ్పీటీసీ విజితారెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు నిట్టనారయణ, మండల అధ్యక్షుడు అర్జున్రావు ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాకులు ఎమ్మెల్యే జైపాల్యాదవ్తో పాటు నాయకులు, కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు.