ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడి పో తుండడంతో చలి తీవ్రత అధికమైనది. దీనికి తోడు ఉదయం సమయాల్లో పొగమంచు కమ్మేస్తుండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపై ప్రయాణించే వారు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తున్నది.
ఉద యం 8.45 గంటలైనా పొగమం చు తెరలు వీడడంలేదు. షాద్నగర్ టౌన్లో పొగమంచులో భానుడు చంద్రుడిలా కనిపించాడు. పొద్దంతా ఉష్ణోగ్రత లు బాగానే ఉంటున్న రాత్రిళ్లు మాత్రం బాగా పడిపోయి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. గ్రామీణ ప్రాంతా ల్లో ప్రజలు చలిమంటలతో ఉపశమనం పొందుతున్నారు.
– న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ