షాబాద్, ఫిబ్రవరి 26: ఆదివారం పల్స్పోలియో చుక్కల మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రతి ఒక్కరూ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఉమ్మడి జిల్లా వైద్యాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కాగా, మంత్రి బడంగ్పేట్ యూపీహెస్సీలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
పరిగి, ఫిబ్రవరి 26: పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమానికి వైద్యారోగ్య శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని ఐదేండ్లలోపు చిన్నారులందరికీ ఆదివారం పోలియో చుక్కలు వేయనున్నా రు. వికారాబాద్ జిల్లాలో ఐదేండ్లలోపు చిన్నారులు 93,232 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారందరికీ పోలియో చుక్కలు వేయించేందుకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలియో చుక్కలు వేయించి తమ చిన్నారులను మహమ్మారి నుంచి కాపాడుకోవాలని శనివారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యం లో వికారాబాద్లో ర్యాలీ నిర్వహించారు.
జిల్లాలోని చిన్నారులకు పోలియో చుక్కలను పంపిణీ చేసేందుకు 670 ప్రత్యేక బూత్లను అధికారులు ఏర్పాటుచేశారు. వాటితోపాటు జిల్లావ్యాప్తంగా 25 మొబైల్ టీమ్లు కూడా పనిచేయనున్నాయి. అవి బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రజ లు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో చిన్నారులకు పోలియో చుక్కలను పంపిణీ చేయనున్నా యి. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగునుంది. ఆదివారం పోలియో చుక్కలు వేయించని చిన్నారులకు సోమ, మంగళవారాల్లో రెండు రోజులపాటు ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేయనున్నారు.
షాబాద్, ఫిబ్రవరి 26: పల్స్పోలియో విజయవంతానికి రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఐదేండ్లలోపు చిన్నారులకు ఆరోగ్య సిబ్బం ది, అంగన్వాడీ సిబ్బందితోపాటు ఆశ వర్కర్లు పోలియో చుక్కలను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం అధికారులు 1,551 పోలియో బూ త్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఐదేండ్లలోపు చిన్నారులు 3,92, 943 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాస్థాయిలో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 12 మంది అధికారులను నియమించారు. జిల్లాలోని అన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఇతర ప్రయాణ ప్రాంగణాల్లోనూ చుక్కల మందును పంపిణీ చేసేందుకు 46 మొ బైల్ టీమ్లను ఏర్పాటు చేశారు. విధుల నిర్వ హణలో 6204 వైద్య సిబ్బంది ఉండనున్నారు.
పల్స్ పోలియో విజయవంతానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఆదివారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జిల్లాలో ఏర్పాటు చేసిన 670 కేంద్రాల్లో చిన్నారులకు పోలియో చుక్కలను పంపిణీ చేస్తారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి. తద్వారా పోలియో మహమ్మారి నుంచి రక్షణ పొందొచ్చు. -డాక్టర్ జీవరాజ్, వికారాబాద్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి