పరిగి, మే 29 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు సంబురంగా నిర్వహించాలని పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, దోమ ఎంపీపీ అనసూయ, జడ్పీటీసీ కె.నాగారెడ్డి, పూడూరు ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మలిపెద్ది మేఘమాల సూచించారు. జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పరిగి మున్సిపాలిటీ, దోమ మండల పరిషత్, పూడూరు మండల పరిషత్లలో సోమవారం జరిగిన సన్నాహక సమావేశాలలో వారు మాట్లాడుతూ ప్రభు త్వం సూచించిన విధంగా ప్రతిరోజు సంబంధిత కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చూడాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు విజయవంతమయ్యేలా చూడాల్సిందిగా వారు సూచించారు. కార్యక్రమాల్లో పరిగి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, దోమ వైస్ ఎంపీపీ మల్లేశం, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బి.లక్ష్మయ్య, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు కె.రాజిరెడ్డి, పూడూరు మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు రాజేందర్రెడ్డి, ఎంపీడీవో ఉమాదేవి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ నియోజకవర్గంలో..
వికారాబాద్, మే 29 : దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని వికారాబాద్ డిప్యూ టీ సీఈవో సుభాషిణి అన్నారు. సోమవారం వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరితో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అవగాహన సమావేశం నిర్వహించారు. రైతు వేదికల్లో రైతులకు సంబంధించిన కార్యక్రమాన్ని విజయవంతంగా జరపడానికి తమ వంతు సహకారం అందిస్తామని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు డి.రాంరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు వెంకటయ్య, మండల కో ఆర్డినేషన్ సభ్యులు సయ్యద్ జాఫర్, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, ఎంపీడీవో సత్తయ్య, ఎంఈవో బాబు సింగ్, ఎంపీవో నాగరాజు, ఏపీఎం, ఉపాధి హామీ, విద్యుత్, నీటి పారుదల శాఖల సిబ్బంది పాల్గొన్నారు. కోట్పల్లి మండల కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు సత్యం, ఎంపీటీసీలు బందయ్య, సర్పంచ్లు వెంకటేశ్యాదవ్, సుందరి అనిల్, మల్లయ్య, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, తహసీల్దార్ అశ్వక్ రసూల్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మండల సమావేశం నిర్వహించారు. ఎంపీపీ లలితా రమేశ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో అనిత, జడ్పీటీసీ మధుకర్, కో ఆప్షన్ సభ్యుడు సోహెల్, ఆయా శాఖల అధికారులు,ఎంపీటీసీలు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా దశాబ్ది ఉత్సవా లను ఘనంగా జరుపుకోవాలని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అన్నారు. సోమవారం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాండూరు నియోజకవర్గంలో..
తాండూరు రూరల్ మే 29 : రాష్ట్ర అవతరణ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేం దుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని తాండూరు ఎంపీపీ అనితాగౌడ్ అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాల పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ప్రధానంగా ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయం చేసుకుంటూ రాష్ట్రం పది సంవత్సరాల్లో సాధించిన విజయాలు, సంక్షేమ, అభివృద్ధికార్యక్రమాల గురించి క్షుణ్ణంగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. జడ్పీటీసీ గౌడి మంజుల మాట్లాడుతూ తెలంగాణ సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలన్నారు. పీఏసీసీఎస్ చైర్మన్ రవీందర్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు…తెలంగాణ వచ్చిన తర్వాత (నాడు-నేడు)అనే అంశాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ స్వరూప, తహసీల్దార్ చెన్నప్పలనాయుడు, ఎంపీడీవో సుదర్శన్రెడ్డి, ఎంఈవో వెంకటయ్య, ఫారెస్టు అధికారి శ్యాంసుందర్, తదితరులు ఉన్నారు.
బషీరాబాద్ : దశాబ్ది ఉత్సవాలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొనాలని నావంద్గి సహకార సంఘం చైర్మన్ అల్లాపూరం వెంకట్రాంరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేకాధికారి స్టీవెన్ అధ్యక్షతను దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రత్యేకాధికారి స్టీవెన్ మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అన్నపూర్ణ, తహసీల్దార్ వెంకటస్వామి, ఎస్సై వేణుగోపాల్గౌడ్, ఎంపీవో రమేశ్ పాల్గొన్నారు.
పెద్దేముల్: దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని మండల ఎంపీడీవో లక్ష్మప్ప, ఎమ్మార్వో విద్యాసాగర్రెడ్డి అన్నారు. మండల పరి షత్ కార్యా లయ సమావేశమందిరంలో దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాల నిర్వహణపై మండల, గ్రామస్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యాలయాన్ని విద్యుత్దీపాలతో ముస్తాబుచేయాలని కోరారు. జూన్ 2 నుంచి 22 వరకు 21 రోజు లు ప్రతి రోజు నిర్దేశించిన షెడ్యూ ల్డ్ ప్రకారం దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. మండల, గ్రామస్థాయిలో దశాబ్ది ఉత్సవాలపై అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు.కార్యక్రమంలో ఎంపీవో షేక్ సుష్మా, ఏపీవో లక్ష్మీదేవి, ఏపీఎం బాలయ్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.