షాబాద్, జనవరి 24: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ గ్రామాలకు చెందిన 21మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, 10 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. 70 ఏండ్ల కాలంలో ఏ ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు అమలు చేయని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం సహాయనిధి ద్వారా చేవెళ్ల నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.10 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.
హైదరాబాద్ నగరానికి అతి దగ్గర్లో, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉన్న షాబాద్ మండలంతో పాటు చేవెళ్ల నియోజకవర్గం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. సీతారాంపూర్లో ఏర్పాటు కాబోతున్న ఎలక్ట్రికల్ కార్ల కంపెనీతో మరింత మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పేదల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, వైస్ ఎంపీపీ జడల లక్ష్మి, సర్దార్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూర్ నర్సింగ్రావు, తహసీల్దార్ సైదులుగౌడ్, డిప్యూటీ తహసీల్దార్ మధు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొలన్ ప్రభాకర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు కృష్ణారెడ్డి, దర్శన్, మల్లేశ్, రాంచంద్రారెడ్డి, శ్రీధర్రెడ్డి, నర్సింహులు, చంద్రశేఖర్, అనిత, బీఆర్ఎస్ నాయకులు సుధాకర్రెడ్డి, అరీఫ్, శ్రీరాంరెడ్డి, సత్యం, రామస్వామి, పాండురంగారావు, మల్లికార్జున్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
నిరుపేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 46 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి , నలుగురికి షాదీ ముబారక్ , 11 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతితో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం అందించడం జరుగుతున్నదన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీసీ కర్నె శివప్రసాద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ మోహన్ రెడ్డి, మల్లారెడ్డి, నరహరి రెడ్డి, జంగారెడ్డి, ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, డైరెక్టర్లు తెలుగు వెంకటేశ్, ఫయాజ్, నాయకులు కృష్ణారెడ్డి, అబ్దుల్ ఘనీ, రవికాంత్ రెడ్డి, దండు సత్తి పాల్గొన్నారు.