వికారాబాద్, ఆగస్టు 23, (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు రాజ్భవన్లో మంత్రిగా మహేందర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ విస్తరణలో భాగంగా పట్నం మహేందర్ రెడ్డికి మంత్రిగా సీఎం కేసీఆర్ అవకాశమిచ్చారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తొలిసారి రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓటమిపాలుకాగా.. ఆయన పార్టీ బలోపేతానికి చేసిన కృషి, సీనియర్ నేత కావడంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ అవకాశమిచ్చారు. మహేందర్రెడ్డి తాండూర్ నియోజకవర్గం నుంచి 1994, 1999, 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. 2019, 2022లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మహేందర్రెడ్డి ఎన్నికయ్యారు.