తాండూరు : రక్తదానం మహాదానమని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. మంగళవారం పోలీస్ శాఖ తాండూరు డివిజన్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పోలీసులతో పాటు 153 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ నారాయణ మాట్లాడుతూ రక్తదానం ఇవ్వడంతో ఆరిపోతున్న ప్రాణాన్ని కాపాడగలమని తెలిపారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం ఇచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి యువతను రక్తదాతలుగా మార్చిన తాండూరు డివిజన్ పోలీసులను అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ లక్ష్మినారాయణ, తాండూరు రూరల్ సీఐ జలేందర్రెడ్డి, పట్టణ సీఐ రాజేందర్రెడ్డి, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.