తాండూరు రూరల్ : వచ్చే మార్చి నాటిని టీ కాస్ పనులు పూర్తి చేస్తామని దక్షణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అన్నారు. శుక్రవారం తాండూరులోని రైల్వేస్టేషన్తో పాటు సీసీఐ రైల్వే ట్రాక్ను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ దక్షణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటి వరకు 560 కిలోమీటర్ల మేర టీ కాస్ పనులు పూర్తయ్యాయని వివరించారు. ఇంకా 640 కిలోమీటర్ల పనులు పెండింగ్లో ఉన్నాయని, వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ పనులు పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. తాండూరు, నారాయణపూర్ రోడ్డు, అండ్ బిడ్జ్రిల నిర్మాణాలపై చేవెళ్ల ఎంపీ రజింత్రెడ్డి ఇచ్చిన వినతుల గురించి ప్రశ్నించగా, ఇలాంటి వినతులు చాలా వచ్చాయని, వాటిపై సమగ్ర విచారణ చేస్తున్నామన్నారు.
ఎక్కడెక్కడ పనులు చేయాలనే అంశాల గురించి క్షుణంగా పరిశీలన చేస్తున్నామన్నారు. కరోనా కారణంగా పూర్తిస్థాయిలో రైళ్లు నడవడం లేదన్నారు. పూర్తిస్థాయిలో రైళ్లు నడిచిన తర్వాత ప్రయాణికులకు సీజన్ పాసులు, విద్యార్థుల పాసులు, జనరల్ టికెట్లపై కూడా పరిశీలన చేస్తామన్నారు. ఆయన వెంట డీఆర్ఎం గుప్తా, పలువురు రైల్వే అధికారులు ఉన్నారు.