తాండూరు : రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజవరకు కొనుగోలు చేపడుతామని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొనే సమయంలో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. రైతులు కష్టపడి పండించిన పంటకు మద్ధతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు నిరంతరం అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ దీపనర్సింలు ఉన్నారు.