మొయినాబాద్, అక్టోబర్ 3 : గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ ల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అ న్నారు. మండలంలోని కనకమామిడి గ్రా మం నుంచి వెంకటాపూర్ గ్రామం వరకు ఉన్న పంచాయతీరాజ్ రోడ్డు బీటీ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6.50 కో ట్లు మంజూరు చేసిన నేపథ్యంలో ఆ పనుల ప్రారంభానికి మంగళవారం ఆయన కనకమామి డి గేట్ వద్ద శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గ్రా మంలో నూతనంగా నిర్మించిన అంతర్గ త మురుగు కా లువలు, సీసీ రోడ్లను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు.
గ్రామాల్లోని సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువల నిర్మాణంతోపాటు గ్రామాలకు ఉన్న పంచాయతీరాజ్, జిల్లా పరిషత్ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులను కేటాయిస్తుందన్నారు. ఒక వైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షే మం జోడెద్దులా పరుగులు తీస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశా నికే ఆదర్శంగా మారిందని కొనియాడా రు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
మొయినాబాద్ మం డలంలోని అన్ని గ్రా మాల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే ఆ పనులను కూడ పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పం చ్ పట్లోళ్ల జనార్దన్రెడ్డి, ఎంపీటీసీ ప్రభావతి, వెంకటాపూర్ సర్పంచ్ మనోజ్కుమార్,ఎంపీడీవో సంధ్య, ఎంపీవో వెంకటేశ్వర్రెడ్డి, పీఆర్డీఈ విజయ్కుమార్, ఏఈలు ఆశాజ్యో తి, రమ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, మాజీ ఉపసర్పంచ్ రాంరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గణేశ్రెడ్డి, మాజీ ఎంపీటీసీ రవీందర్, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, వెంకట్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ రాజు, మాజీ సర్పంచ్ సుధాకర్యాదవ్, యువత అధ్యక్షుడు పరమేశ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రమేశ్, ఎంఎస్ రత్యం, బాలు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.