కులకచర్ల, నవంబర్ 25: రైతులు ధాన్యం కొనుగోలు కేం ద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సత్యమ్మ అన్నా రు. శుక్రవారం కులకచర్ల మండల పరిధిలోని సాల్వీడ్ గ్రా మంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ బాల య్య అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంద న్నారు. రైతులు ప్రైవేటు వ్యాపారుల దగ్గరకు వెళ్లి నష్టపోకుండా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలన్నారు.
ధాన్యం తీసుకున్న 15 రోజు ల్లోనే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తుందని తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేం ద్రా లకు తీసుకువచ్చి విక్రయించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, రైతు బంధు సమితి మండల అధ్య క్షుడు పీరంపల్లి రాజు, టీఆర్ఎస్ పార్టీ కులకచర్ల మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ కొండయ్య, ఐకేపీ ఏపీఎం శోభ, గ్రామాల రైతులు పాల్గొన్నారు. అలాగే చౌడా పూర్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వ ర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రజాప్రతినిధులు ప్రారంభిం చారు. కులకచర్ల మండల పరిధిలోని ముజా హిద్పూర్ గ్రా మంలో గ్రామ సర్పంచ్ లక్ష్మి అధ్యక్షతన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యమ్మ, ఉపసర్పంచ్ చంద్రభూపాల్రావు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.