దోమ, డిసెంబర్ 2: మండలంలోని బొంపల్లి ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు మాక్ పోలింగ్(నమూనా ఎలక్షన్)ను విజయవంతంగా నిర్వహించారు. ఐదు నుంచి పదోతరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఎన్నికలో పోటీదారులుగా.. ఓటర్లుగా.. ఎన్నికల సిబ్బందిగా.. పోలీసులుగా విధులు నిర్వహించి అలరించారు.
విద్యార్థులకు ఎన్నికల విధానంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్ను నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయుడు హరిలాల్ పేర్కొన్నారు. ఈ నమూనా ఎన్నికలో శ్రీశైలం అనే వ్యక్తి అత్యధిక ఓట్లు సాధించి విజయం సాధించాడు. కార్యక్రమంలో ఎంఈవో హరిశ్చందర్, ఎస్ఐ విశ్వజన్, ఉపాధ్యాయులు, సర్పంచ్ సురేశ్, అనంతయ్య, శ్రీనివాస్, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.