తాండూరు, డిసెంబర్ 5: షీ టీమ్స్పై సోమవారం తాండూరు పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీమ్ ఇన్చార్జి శేఖర్ మాట్లాడుతూ బాలికల భద్రతే షీ టీమ్స్ లక్ష్యమన్నారు. పాఠశాలలో కానీ, బయట ఎక్కడైన ఆకతాయిలు బాలికలను భయాందోళనలకు గురిచేసినా, వేధించినా, ఇబ్బందికరంగా మాట్లాడిన వెంటనే టోల్ఫ్రీ నంబర్ 100, 181 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. బాలికలను, మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు చిన్న విషయాలకు ఆవేద నకు గురికాకూడదని మంచి ఆలోచనతో చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనపై కూడా దృష్టి సారించాల న్నారు. క్రమశిక్షణతో ఉండేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్ర మంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.