కొడంగల్, అక్టోబర్ 27 : కొడంగల్లో కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకున్నదని, కాబట్టే బీఆర్ఎస్ సర్పంచ్లు, నాయకులను కోనుగోలు చేసేందుకు పన్నాగం పన్నుతున్నారని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, భూగర్భజల, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఓటమి భయంతో కొడంగల్లో ప్రతి సర్పంచ్కు రూ.15లక్షలు ఏరవేసి కొనేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, బీఆర్ఎస్ నాయకులు ధర్మానికి, పార్టీకి కట్టుబడి ఉండేవారు కాబట్టే కాంగ్రెస్ యత్నాన్ని తిప్పికొట్టి, రేవంత్కు చెంపపెట్టు సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజలను ఓట్లు అడిగే దమ్ముధైర్యం లేక రేవంత్రెడ్డి దిగజారుడు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్పై ఇప్పటికే ప్రజలకు నమ్మకం పోయిందని, ఇటువంటి వెర్రివేషాల వల్ల మరింత అసహ్యం కలుగుతున్నదన్నారు. పైసకు అమ్ముడుపోయే గుణం రేవంత్రెడ్డికి ఉన్నదని, అందరికీ అటువంటి బుద్ధి ఉందని అనుకుంటే పప్పులో కాలేసినట్లేనని సమాధానమిచ్చారు. ప్రజల ఆశీస్సులు బీఆర్ఎస్కు మెండుగా ఉన్నాయని తెలిపారు. రేవంత్రెడ్డి ఎన్ని జిమ్మికులు, కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ కొడంగల్లో భారీ మెజార్టీతో పట్నం నరేందర్రెడ్డి విజయం ఖాయమని, కొడంగల్లో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందన్నారు. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు నేటి వరకూ ఏ ఒక్కటీ అమలు కావడం లేదనే విషయాన్ని మొన్న కర్ణాటక రైతులు కొడంగల్లో గోడును వినిపించుకున్నారన్నారు.
అధికారంలో ఉన్న కర్ణాటకలో 6 గ్యారెంటీలు అమలు చేసే ఊసు లేదు కానీ, తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అక్కడ అమలు చేయని వారు ఇక్కడ ఏ విధంగా అమలు చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతులకు రూ.16వేల పంట పెట్టుబడి, రూ. 4 నుంచి 6వేల వరకు ఆసరా పింఛన్ల పెంపు, రూ.15లక్షల ఆరోగ్యశ్రీ, పేద మహిళలకు ప్రతి నెలా రూ.3వేలు, రూ.5లక్షల కుటుంబ బీమా వంటి ఎన్నో అద్భుత పథకాలను అందించే హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చడంతో పాటు ఎన్నో ఊహించని పథకాలను అందించిన విషయం ప్రజలకు తెలుసు అన్నారు.
బీఆర్ఎస్ సర్పంచ్ల కొనుగోలుకు సంబంధించి కాంగ్రెస్ నాయకుల వాయిస్ రికార్డులు ఉన్నాయని, ఎన్నికల కమిషన్కు అందిస్తామని పేర్కొన్నారు. సర్పంచ్ల కొనుగోలును తిప్పికొట్టి కాంగ్రెస్ నాయకులను పోలీసులకు పట్టించిన బీఆర్ఎస్ సర్పంచ్లు నర్సింహానాయక్, రవినాయక్, శంకర్నాయక్లను మంత్రి అభినందించారు. బీఆర్ఎస్లో ఇటువంటి నిజాయితీగా ఉన్న నాయకులు ఎందరో ఉన్నారని, వీరి జోలికి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ మధుసూదన్రావుయాదవ్, బీఆర్ఎస్ నాయకులు దేశ్యానాయక్, విష్ణువర్ధన్రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.