మెరుగైన రవాణా కోసం తెలంగాణ సర్కార్ ప్రాధాన్యమిస్తున్నది. ఇందులో భాగంగా పురాతన, శిథిలావస్థకు చేరిన వంతెనలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా ఆర్అండ్బీ అధికారులు పురాతన, ధ్వంసమైన బ్రిడ్జిలను గుర్తిస్తున్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో ఉన్న బ్రిడ్జి లు 50 ఏండ్ల క్రితం అప్పటి ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్మించినవి కావడంతో ప్రస్తుత అవసరాలకు సరిపోవడంలేదు.
అంతేకాకుండా ఇటీవల కురిసిన వర్షాలకు బ్రిడ్జిలపై నుంచి వర్షపు నీరు పెద్ద ఎత్తున పారడంతో పలు వంతెనలు గుంతలు, రాళ్లు తేలి పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం వంతెనలకు మరమ్మతులు చేయడం, నూ తన బ్రిడ్జిలను నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నది. కాగా లష్కర్గూడ, కొహెడ గ్రామాల్లో బ్రిడ్జిల నిర్మాణానికి రూ.ఐదు కోట్ల చొప్పున ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్ల నిధులను కేటాయించగా..టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే పనులు ప్రారంభం కానున్నాయి. దీని ద్వారా పలు గ్రామాల వాహనదారులు, ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనున్నది.
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 26: రంగారెడ్డి జిల్లాలో పురాతన, శిథిలావస్థకు చేరిన పలు వంతెనలకు మరమ్మతులు చేసి ప్రజ ల ఇబ్బందులు తొలగించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు బ్రిడ్జిలపై నుంచి పెద్ద ఎత్తున వర్షపునీరు పారడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
సుమారు 50 ఏండ్ల క్రితం అప్పటి వాహనాల రద్దీకి అనుగుణంగా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో బ్రిడ్జిలను నిర్మించారు. దీంతో ప్రస్తుత అవసరాలకు అవి సరిపోవడంలేదు. దీంతో ప్రభుత్వం వాటి స్థా నంలో కొత్త బ్రిడ్జిలను నిర్మించాలని భావిస్తున్నది. దీంతో రో డ్లు, భవనాల శాఖ అధికారులు శిథిలావస్థకు చేరిన వంతెనలను గుర్తించడంతోపాటు ఆయా బ్రిడ్జిల నిర్మాణానికి అవసరమైన నిధులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజల వెతలు తీరనున్నాయి.
లష్కర్గూడ బ్రిడ్జికి రూ.5కోట్లు మంజూరు..
నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్మెట్ మండల సమీపంలో ని లష్కర్గూడ బ్రిడ్జికి ప్రభుత్వం ఎట్టకేలకు నిధులను కేటాయించింది. 50 ఏండ్ల క్రితం ఈ బ్రిడ్జిని నిర్మించగా ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరింది. దీంతో తరచూ ఈ బ్రిడ్జిపై ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు ఈ బ్రిడ్జిపై నుంచి పొంగిపొర్లడంతో ..దాని ప్రవాహానికి బ్రిడ్జిపై వెళ్తున్న కారు కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ బ్రిడ్జిని బాగు చేయాలని ఎన్నో ఏండ్లుగా ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. కాగా స్థానికుల వినతులను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేయించారు. త్వరలోనే టెండర్లను పిలిచి పనులను ప్రారంభించనున్నారు. అలాగే ఇబ్రహీంపట్నం నుంచి అబ్దుల్లాపూర్మెట్ను కలిపే ప్రధాన రహదారి విస్తరణ పనులను చేపట్టేందుకు కూడా నిధు లు మంజూరయ్యాయి. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే లష్కర్గూడ, సుర్మాయిగూడ, అనాజ్పూర్, మజీద్పూర్ తదితర గ్రామాలకు రాకపోకలు మరింత మెరుగవుతాయి. అలా గే, ఎగువ నుంచి వస్తున్న వర్షపునీరు ప్రస్తుతం ఈ బ్రిడ్జిపై నుం చి పారుతున్నది. ఈ సమస్యకు చెక్పడే అవకాశాలున్నాయి.
కొహెడ కల్వర్టుకు మరో రూ.5కోట్లు..
కొహెడ నుంచి హయత్నగర్కు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు నిర్మాణానికి ప్రభుత్వం మరో రూ.5 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇటీవల కురిసిన వర్షాలకు కొహెడ సమీపంలోని వంతెనపై నుంచి పెద్ద ఎత్తున వరదనీరు ప్రవహించి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ రోడ్డుపై కల్వర్టు నిర్మించి ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే కొహెడ, సంఘీనగర్ తదితర గ్రామాలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనున్నది.
త్వరలోనే పనులు ప్రారంభం
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వంతెనలు శిథిలావస్థకు చేరా యి. అందువల్ల వాటిస్థానంలో కొత్త వి నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఆర్అండ్బీ అధికారులు జిల్లాలో పురాతన, శిథిలావస్థకు చేరి న వంతెనలను గుర్తించి వాటి నిర్మా ణానికి కావాల్సిన నిధులకోసం ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. కాగా ఇప్పటికే లష్కర్గూడ, కొహెడ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 కోట్లను మంజూరు చేసింది. త్వరలోనే టెండర్లను పిలిచి
పనులను ప్రారంభిస్తాం.
– మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం
బ్రిడ్జి నిర్మిస్తే మాకెంతో ఉపయోగం
ఎన్నో ఏండ్ల క్రితం నిర్మించిన లష్క ర్గూడ వంతెన శిథిలావస్థకు చేరిం ది. భారీ వర్షాలు పడితే ఆ నీటితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. ఈ వంతెనను బాగు చేయాలని గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులకు చెబి తే పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరవతో శిథిలావస్థకు చేరిన వంతెన మరమ్మతులకు నిధులు మంజూరు కావడం ఎంతో సంతోషకరం.
– సాయికుమార్, లష్కర్గూడ, ఎంపీటీసీ
నిధుల మంజూరు హర్షణీయం
నా చిన్నతనంలో నిర్మించిన లష్కర్గూడ వంతెన ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. ఈ వంతెనపై వెళ్లాలంటే ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యే కిషన్రెడ్డి సహకారంతో నూతన వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించడం సంతోషకరం.
– షరీఫ్ఖాన్, లష్కర్గూడవాసి