పరిగి : రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పరిగి మండలం రంగంపల్లిలో కొప్పుల రంగమ్మ దేశ్ముఖ్ స్మారకార్థం ఆమె మనుమడు కొప్పుల వెంకటసురేష్చందర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను, గడిసింగాపూర్లో జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అశోక్వర్దన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా విద్యార్థుల దైనొందిన జీవితలో ఆటలను అంతర్భాగం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు. కొత్త క్రీడా పాలసీతో విద్యార్థులు ఆటల వైపు మొగ్గు చూపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.
గతంలోనే అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు గణనీయంగా పెంచిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే తెలిపారు. క్రీడల్లో పాలుపంచుకోవడం ద్వారా శారీరక ధారుడ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. యువత సైతం తరచుగా తమకు నచ్చిన క్రీడలలో పాల్గొనాలని అన్నారు. పరిగి ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులు ఉన్నారని, పరిగిలో అంతరాష్ట్ర క్రీడలు నిర్వహించడం జరిగిందన్నారు. క్రీడాకారులకు తమవంతు ప్రోత్సాహం అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. టోర్నమెంట్ల నిర్వహణ క్రీడాకారులకు చక్కటి ప్రోత్సాహకరంగా ఉంటుందని, తమలో దాగివున్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి దోహదం చేస్తాయన్నారు.
షోండేపూర్లో నిర్వహించిన క్రికెట్ పోటీలలో విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. కార్యక్రమాలలో టీఆర్ఎస్ నాయకులు కొప్పుల అనిల్రెడ్డి, ఎంపీపీ అరవిందరావు, మార్కెట్ చైర్మన్ సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అశోక్వర్దన్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొప్పుల సురేష్చందర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.