కుభీర్, ఫిబ్రవరి 1 : తెలంగాణ ఏర్పాటు తర్వాత విద్య, వైద్య రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని కస్ర నయాబాదిలో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా రూ.22 లక్షలతో అభివృద్ధి చేసి పాఠశాలను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాలేగాంలో రూ.కోటితో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు రూ.4.50 లక్షలతో రెండు ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. అలాగే ‘మన ఊరు-మన బడి’ కింద రూ.రూ.1.02కోట్లతో ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో భాగంగానే సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు నేడు ఆనందంతో ఉన్నారని, ఇది చూసి ఓర్వలేని వారు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అలాంటి వారి మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. కస్ర, మాలేగాంవ్ సర్పంచ్లు ఐల సుష్మ, విఠాపూర్ మహిపాల్రెడ్డి, పాఠశాలల హెచ్ఎంలు మహరున్నీసాబేగం, మాలింగి పోశెట్టి, పాఠశాల చైర్మన్ సురేశ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, ఎంపీటీసీ గంగారావు, పార్టీ గ్రామ అధ్యక్షుడు రమేశ్, మల్లారెడ్డి, దత్తహరి పటేల్, దొంతుల దేవిదాస్, శేఖర్ రెడ్డి, ఆనంద్శేల్కే, కచ్చకాయల కిషన్, వీడీసీ సభ్యులు, ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఓవైసీనగర్ పాఠశాల ప్రారంభం..
భైంసా, పిబ్రవరి 1 : భైంసా పట్టణంలోని ఓవైసీ నగర్లో రూ.29 లక్షలతో అభివృద్ధి పనులు చేసిన పాఠశాలను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపర్చాలన్న సంకల్పంతో ‘మన ఊరు-మన బడి’ని తీసుకువచ్చారన్నారు. తాగునీటి వసతితో పాటు, అధునాతన పద్ధతులతో కార్పొరేట్స్థాయిలో ఉండేలా బెంచీలను సమకూరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సుభాష్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రమణారావు, భూషణ్, ఎంఐఎం కౌన్సిలర్లు ఫయజుల్లాఖాన్, అమీర్, ఇర్ఫాన్, మాజీద్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆసీఫ్, నాయకులు ఆళా, భోజరాం, గజ్జు, తదితరులు పాల్గొన్నారు.