కడ్తాల్, మార్చి 20 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై ముమ్మర తనిఖీలు చేపట్టారు. కడ్తాల్ కేంద్రం సమీపంలోని టోల్ప్లాజా వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్పోస్టును బుధవారం సాయంత్రం శంషాబాద్ డీసీసీ నారాయణరెడ్డి, అడిషనల్ డీసీపీ రామ్కుమార్ పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రహదారిపై రాకపోకలు కొనసాగించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.
రసీదులు, ఆధారాలు లేకుండా నగదు, బంగారం రవాణా చేయవద్దన్నారు. తనిఖీల్లో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు ఉంటే వాటికి సరైన పత్రాలు చూపించాలని తెలిపారు. కడ్తాల్తోపాటు, షాద్నగర్, రాయకల్ టోల్ప్లాజా, పాల్మాకుల, లాల్పహాడ్, చౌదరిగూడెంలో చెక్పోస్టులు ఏర్పాటు చేశామని వివరించారు. అనంతరం స్థానిక పోలీసులతో కలిసి ఆయన పలు వాహనాలను తనీఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కడ్తాల్, ఆమనగల్లు ఎస్హెచ్వోలు శివప్రసాద్, ప్రమోద్కుమార్, ఎస్ఐలు వరప్రసాద్, బలరాంనాయక్, శ్రీకాంత్, ఏఎస్ఐ సీతారాంరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.