షాద్నగర్టౌన్ : హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే హుజూరాబాద్ గురువారం సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబాల్నాయక్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టిన ప్రతి పథకం దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.
గతంలో ఎలాంటి అభివృద్ధి నోచుకుని ఎన్నో గ్రామాలు నేడు అభివృద్ధి పథంలో ముందుకుసాగుతూ పట్టణాలను తలపిస్తున్నాయనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే లక్ష్యం ముందుకుసాగుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని అన్నారు. అదే విధంగా అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న ప్రభుత్వాన్ని ప్రజలు అండగా నిలువాలన్నారు. కార్యక్రమంలో కొత్తూరు కౌన్సిలర్ శ్రీను, నాయకులు రాజు, విఠల్ పాల్గొన్నారు.