షాద్నగర్ టౌన్ : ప్రజా సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే మున్సిపాలిటీలోని భవానీ కాలనికి చెందిన హరీశ్, సోలిపూర్ గ్రామానికి చెందిన పుష్పమ్మ, బీవీరావునగర్ కాలనీ చెందిన శ్రీనివాస్రావు ఆనారోగ్యంతో బాధపడుతూ కొన్ని రోజుల క్రితం ప్రైవేటు దవాఖానలో వైద్యం చేయించుకున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కావడంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన హరీశ్కు రూ. 66,500, పుష్పమ్మ రూ. 60వేలు, శ్రీనివాస్రావుకు రూ. 60వేల చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు.
ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీఎం సహాయనిధి అందజేయడం పై సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్ నర్సింహ, కృష్ణవేణి, నాయకులు రఘునాథ్యాదవ్, చీపిరి రమేశ్ యాదవ్ పాల్గొన్నారు.