షాద్నగర్టౌన్ : స్వాతంత్ర్య సమరయోధుడు, అహింసావాది, జాతిపిత మహ్మాత్మా గాంధీ 152వ జయంతిని ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. శనివారం షాద్నగర్ మున్సిపాలిటీ గంజ్రోడ్డులోని మహాత్మాగాంధీ, లాల్బహదూర్శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్తో కలిసి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అహింసా వాదంతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహానీయుడని కొనియాడారు.
మహాత్మాగాంధీ అందరికీ ఆదర్శప్రాయుడన్నారు. ఉద్యమంలో లాల్బహదూర్శాస్త్రి సేవలు చిరస్మరణీయమన్నారు. మహానీయులు నడిచిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. అదే విధంగా గ్రంథాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్ ఆహ్మాద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీడీఓ శరత్బాబు, కమిషనర్ లావణ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.