షాద్నగర్, డిసెంబర్1ః షాద్నగర్ పట్టణంలో గంజాయిని చాక్లెట్ల రూపంలో తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని, మరో ఇద్దరిని షాద్నగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పట్టణంలోని నాగులపల్లి రోడ్డులోని కిరాణా షాపులో గంజాయిని చాక్లెట్ల రూపంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా గమనించి పట్టుకున్నామని ఎక్సైజ్ సీఐ రామకృష్ణ తెలిపారు.
వారి నుంచి 480 గంజాయి చాక్లెట్లను స్వా ధీనం చేసుకొని సుశీల్, శశికాంత్, జలంధర్, అజయ్కుమార్లపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కాటేదాన్, షాద్నగర్ ప్రాంతాలకు చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా నందిగామలోని అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో ఓ షాపులో కూ డా 40 గంజాయి చాక్లెట్లను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.